BJP vs BRS : కవిత ఈడీ నోటీసుల కామెంట్స్ పై బండి సంజయ్ కౌంటర్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ నోటీసులు అందాయి. రేపు విచారణకు రావాలని ఆమెకు ఈడీ అధికారులు నోటీసులు
- By Prasad Published Date - 10:04 PM, Thu - 14 September 23
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ నోటీసులు అందాయి. రేపు విచారణకు రావాలని ఆమెకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.. అయితే నోటీసులపై కవిత స్పందించారు. అవి ఈడీ నోటీసులు కాదు మోడీ నోటీసులు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత వ్యాఖ్యలకు బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కవితకు ఇచ్చిన ఈడీ నోటీసులకు బీజేపీకి ఏం సంబంధం? అంటూ ఆయన ప్రశ్నించారు. తప్పు చేశారని ఆధారాలుంటే విచారించే అధికారం ఈడీకి ఉందని బండి సంజయ్ తెలిపారు. మోడీ ఛరిష్మా ముందు కేసీఆర్ దిగదుడుపేనని.. కేసీఆర్ మోహం చూసి ఓట్లేసే రోజులు పోయాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని.. డిపాజిట్లు రాని కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
Tags
Related News
Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు
Raghunandan Rao:మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ జరిగిన కిసాన్ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రెవంత్రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now