Aviation Show: హైదరాబాద్ లో ఏవియేషన్ షో షురూ.. బేగంపేటలో సందడే సందడి
- By Balu J Published Date - 03:20 PM, Thu - 18 January 24
బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. వింగ్స్ ఇండియా-2024 ఈవెంట్ నేటి నుండి నాలుగు రోజుల పాటు జరుగుతుంది. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సేవలను అప్గ్రేడ్ చేయడానికి 2023లో 777-9 ఎయిర్క్రాఫ్ట్లలో 10 విమానాలను ఆర్డర్ చేసింది.
అంతర్జాతీయ విమానాల ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777-9 విమానం రానుంది. ఇప్పటికే విమానం బేగంపేట విమనాశ్రయానికి చేరుకుంది. ఈ నాలుగు రోజుల పాటు బేగంపేటలో ఈ విమానం సందడి చేయనున్నాయి. గతంలో 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు పర్యాయాలు విమాన విన్యాసాలు నిర్వహించగా.. ఈసారి 45 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విన్యాసాలు చేయనున్నారు.
చివరి రోజు ఆదివారం సందర్శకులు ఎక్కువగా వచ్చేఅకాశం ఉన్నందున ఆ రోజు మూడుసార్లు విన్యాసాలు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు దాదాపు 30 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. 5వేల మందికిపైగా వ్యాపారవేత్తలు వింగ్స్ ఇండియాను సందర్శించి పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఈ షోలో 130 ఎగ్జిబిట్లు అందుబాటులో ఉండనున్నాయి. వింగ్స్ ఇండియా -2024 కార్యక్రమం కారణంగా బేగంపేట రోడ్డు మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Related News
Rain Alert : మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది