Omicron In TS:తెలంగాణాలో మళ్ళీ 12 ఓమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
- By Hashtag U Published Date - 11:35 PM, Mon - 27 December 21
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిని కలిసిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకింది. తాజా కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కి చేరింది. వీరిలో పది మంది కోలుకున్నారని వైద్యులు తెలిపారు.
రాష్ట్రంలో పూర్తిగా తగ్గిన కరోనా కేసులు కూడా మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. లాస్ట్ 24 గంటల్లో 37,839 శాంపిల్స్ టెస్ట్ చేయగా వారిలో 182 మందికి పాజిటివ్ వచ్చింది. గ్రేటర్ పరిధిలో 90 కొత్త కేసులు నమోదవగా, రంగారెడ్డిలో 17, మేడ్చల్ మల్కాజిగిరిలో 11 కేసులు నమోదయ్యాయి.
లాస్ట్ 24 గంటల్లో 181 మంది కరోనా నుంచి కోలుకోగా ఒకరు చనిపోయారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,844 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 6,73,404 మంది కోలుకున్నారు. 3,417 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,023కి చేరింది.
ఒమిక్రాన్ తీవ్రతను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని, ప్రజలు స్వీయ రక్షణలు తప్పకుండా పాటించాలని వైద్యులు కోరుతున్నారు.
Related News
New COVID Variant: కరోనా నుంచి మరో కొత్త రకం.. భారత్లో పెరుగుతున్న ఆందోళన
భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తోంది.