Taj Mahal: తాజ్ మహల్ను ఎంత స్థలంలో నిర్మించారు..? తాజ్ మహల్ కోసం ప్రతి ఏడాది ఎంతమంది వస్తారంటే..?
ప్రేమకు ప్రతీక అయిన తాజ్ మహల్ (Taj Mahal)ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.
- By Gopichand Published Date - 10:35 AM, Sun - 11 February 24
Taj Mahal: ప్రేమకు ప్రతీక అయిన తాజ్ మహల్ (Taj Mahal)ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఇండియాలో అయినా, విదేశాల్లో అయినా దాని అందాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇప్పటికే చాలామంది తాజ్ మహల్ని చూసే ఉంటారు. అయితే అది ఎంత స్థలాన్ని ఆక్రమించింది. షాజహాన్కి దానిని నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తాజ్ మహల్ ఎంత స్థలంలో నిర్మించబడింది..?
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ వేలాది మంది కార్మికుల శ్రమతో నిర్మించబడింది. ఇది ఎంత స్థలంలో నిర్మించబడిందో మనం మాట్లాడినట్లయితే.. తెల్లని పాలరాయితో చేసిన ఈ అందమైన భవనం 17 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇది 42 ఎకరాలు లేదా 67 బిఘాలలో నిర్మించబడింది.
Also Read: Pakistan Earthquake: పాకిస్థాన్లో మరోసారి భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..!
తాజ్ మహల్ నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది?
షాజహాన్కి తాజ్మహల్ను నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చి ఉండేది అనే ప్రశ్న చాలామంది ఉంది. 1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది. ఆ సమయంలో షాజహాన్ మూడవ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి 14వ సంతానం గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్ విచారంతో నిండిపోయాడు. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ షాజహాన్ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తనకోసం నిర్మించమని కోరింది. షాజహాన్ తన భార్య కోరిక సమ్మతించి ఆమె మరణించిన ఒక సంవత్సరం తరువాత 1632వ సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమ కథే తాజ్ మహల్కు ఒక ప్రేరణ అని సంప్రదాయంగా చరిత్ర చెబుతుంది. ప్రధాన సమాధి 1648వ సంవత్సరంలో పూర్తయింది. చుట్టు ప్రక్కల భవనాలు, ఉద్యానవనం ఐదు సంవత్సరాలకు పూర్తి అయ్యాయి.
We’re now on WhatsApp : Click to Join
తాజ్ మహల్ లో సమాధిని ఎప్పుడు నిర్మించారు..?
సమాధి నిర్మాణం 1643లో పూర్తయింది. అయితే ప్రాజెక్ట్ ఇతర దశల పని మరో 10 సంవత్సరాలు కొనసాగింది. తాజ్ మహల్ అసలు పేరు “రౌజా-ఇ-మునవ్వరా” అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. హిందీలో మెరుస్తున్న సమాధి అని అర్థం. ఇక్కడ ప్రధాన గోపురం ఎత్తు 240 అడుగులు, 4 మినార్ల ఎత్తు 130 అడుగులు ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 80 లక్షల మంది తాజ్ మహల్ చూసేందుకు ఆగ్రాకు వస్తుంటారు.
Related News
Taj Mahal: తాజ్మహల్ను శివాలయంగా ప్రకటించాలి.. కోర్టులో పిటిషన్
Taj Mahal: తాజ్మహల్ (Taj Mahal)పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్ మహల్ను తేజో మహాలయ (Tejo Mahalaya)గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ కోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. తాజ్ మహల్ను తేజో మహాలయ (శివాలయం)గా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టు (Agra Court)లో పిటిషన్ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాద�