HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >For The First Time Modi Is Leading Coalition Government Whats Next

PM Modi : తొలిసారిగా మోడీకి ‘సంకీర్ణ’ పరీక్ష.. వాట్స్ నెక్ట్స్ ?

13 ఏళ్లు గుజరాత్ సీఎంగా.. పదేళ్లు దేశ ప్రధానిగా వ్యవహరించిన తర్వాత తొలిసారిగా నరేంద్రమోడీ రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

  • Author : Dinesh Akula Date : 13-07-2024 - 6:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi Visit Russia

PM Modi :  13 ఏళ్లు గుజరాత్ సీఎంగా.. పదేళ్లు దేశ ప్రధానిగా వ్యవహరించిన తర్వాత తొలిసారిగా నరేంద్రమోడీ రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సంకీర్ణ సర్కారు(Coalition Government) నడుమ తొలిసారిగా ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు. 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ ముఖచిత్రం మారడంతో ఆయనకు ఈ కొత్త అనుభవం ఎదురైంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) కూటమికి మెజారిటీ వచ్చినప్పటికీ.. బీజేపీకి వచ్చిన స్థానాలు, విపక్ష ఇండియా కూటమికి వచ్చిన స్థానాలతో సరిపోలుతాయి. ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి పరిస్థితులను మోడీ(PM Modi) ఎదుర్కోవాల్సి రాలేదు.

We’re now on WhatsApp. Click to Join

గతంలో మూడు కొత్త నేర, న్యాయచట్టాలను ఆమోదించే క్రమంలో నిరసనకు దిగారనే సాకుతో ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.  రాబోయే ఐదేళ్లలో అంత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే విపక్షం చాలా బలపడింది. ఆనాడు ఎంతోమంది విపక్ష ఎంపీలు లేకుండానే మూడు నేర, న్యాయచట్టాల బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదించారు.  ఇకపై ఆ ఛాన్స్ ఉండదు. బిల్లులను కూలంకషంగా చర్చించాల్సి ఉంటుంది. విపక్షానికి విధాన నిర్ణయాలలో తగిన పాత్ర ఇవ్వాల్సి ఉంటుంది. బిల్లుల ఆమోదానికి ఓటింగ్ తప్పకుండా నిర్వహించాలి. ఈ పరిణామాలు కేంద్ర సర్కారుపై, దానికి సారథ్యం వహిస్తున్న మోడీపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. పార్లమెంటరీ కమిటీల పని తీరు కూడా మారనుంది. మారుతున్న సమీకరణాలను కలిపి చూస్తే.. బ్రాండ్ మోడీ క్షీణిస్తున్నాడని స్పష్టమవుతోందని పలువురు రాజకీయ పరిశీలకులు  అభిప్రాయపడుతున్నారు.

Also Read :Silver Prices: భారీగా పెరగనున్న వెండి ధరలు.. రూ. 1.25 లక్షలకు కిలో సిల్వర్..?

సీరియల్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్, అగ్నిపథ్ స్కీమ్, మణిపూర్ అనే మూడు అంశాలపై ప్రతిపక్షాలు ఇప్పటికే కత్తులకు పదును పెడుతున్నాయి. ఇవన్నీ దేశంలోని బీజేపీకి కీలకమైన ఓటుబ్యాంకులోని సింహభాగాన్ని ఆలోచింపజేసే, ప్రభావితం చేసే అంశాలే. మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో బీజేపీ విఫలమైంది. ఈ పరిణామం అక్కడ కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు రెండు లోక్‌సభ స్థానాలు దక్కాయి. ఒడిశా, ఏపీలలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇంతకుముందు ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్, ఏపీకి చెందిన వైఎస్సార్ సీపీ ఎన్డీయేకు మద్దతుగా నిలిచేవి. ఇప్పుడు ఆ రాష్ట్రాలలో ఇతర పార్టీలతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బిజూ జనతాదళ్, వైఎస్సార్ సీపీ విపక్షంలోకి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లోనూ గుడ్డిగా ఆ రెండు పార్టీలు ఎన్డీయే కూటమికే మద్దతు ఇస్తాయని ఎలా విశ్వసించగలం ? సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ సహా కీలక పదవుల్లోని వ్యక్తులను ఎన్నుకోవడంలో విపక్ష నేత పాత్ర కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ విపక్ష నేత స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు.  ప్రధాని మోడీ ఔనన్నా కాదన్నా.. రాహుల్‌తో సమావేశాలకు హాజరుకాక తప్పదు. ఈ అంశాలపై ఆయనతో చర్చించక తప్పదు.ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, సెప్టెంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఒత్తిడి నడుమ ప్రధాని మోడీ(PM Modi) ఎలాంటి వ్యూహ రచన చేస్తారు ? ఎన్డీయే కూటమి ఎలాంటి ఫలితాలను సాధిస్తుంది ? అనేది చాలాకీలకం. గతంతో పోలిస్తే ఇప్పుడు విపక్షాలు బలంగా ఉన్నాయి. వాటి ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది.  ఈ ఉత్సాహం వాటికి కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Coalition Government
  • india
  • modi
  • nda
  • pm modi

Related News

India Rice Export To Iran

ఇరాన్‌కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!

సబ్సిడీ ధరల వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, అక్రమ రవాణా పెరుగుతోందని ఇరాన్ భావిస్తోంది. అందుకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా పౌరుల ఖాతాల్లోకే వేయాలని నిర్ణయించింది.

  • Venezuela Hands Over 50M Barrels Of Oil To USA

    అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

  • donald trump modi

    డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

  • Congress Leader

    ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయ‌కుడు సంచలన వ్యాఖ్యలు!

  • Mustafizur Rahman

    కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

Latest News

  • సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు

  • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

  • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd