HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Promise Of Marriages In Manifesto Jds Innovation In Karnataka Elections

Karnataka Manifesto: మేనిఫెస్టోలో పెళ్లిళ్ల హామీ, కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ వినూత్నం

రైతే రాజు. ఆ రాజు బిడ్డలకు పెళ్లి కావడం కష్టం. వ్యవసాయం చేసే వాళ్లకు పెళ్లి కావడంలేదు. అందుకే కర్ణాటక ఎన్నికల్లో మేనిఫెస్టో గా మారింది. అందరికి తిండిపెట్టే రైతన్న కుటుంబం అంటే అలుసు.

  • By CS Rao Published Date - 07:44 PM, Tue - 11 April 23
  • daily-hunt
Karnataka Elections Manifesto By Jds Party
Karnataka Elections Manifesto By Jds Party

Karnataka Elections Manifesto by JDS Party : రైతే రాజు. ఆ రాజు బిడ్డలకు పెళ్లి కావడం కష్టం. వ్యవసాయం చేసే వాళ్లకు పెళ్లి కావడంలేదు. అందుకే కర్ణాటక (Karnataka) ఎన్నికల్లో మేనిఫెస్టో గా మారింది. అందరికి తిండిపెట్టే రైతన్న కుటుంబం అంటే అలుసు. నెలకు 10వేలు జీతం ఉండే వాళ్లకు పెళ్లి అవుతుంది. కానీ 50 ఎకరాల్లో వ్యవసాయం చేసే వాడికి పిల్లను ఇవ్వడం లేదు. ఇదీ ఇప్పుడున్న సమాజం పోకడ. అందుకే ఆ సమస్య తీవ్రతను గమనించిన జేడీఎస్ వ్యవసాయదారుడిని పెళ్లి చేసుకుంటే 2 లక్షల ప్యాకేజీని ప్రకటించింది. ఇదేదో నవ్వులాట ఆఫర్ అనుకుంటే పొరబాటు. రైతన్న కుటుంబానికి సమాజం ఇచ్చే గౌరవానికి ఇదో కొలమానం.

అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి కీలక హామీ ప్రకటించారు. అధికారంలోకి వస్తే.. రైతుల కొడుకుల‌ను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 2 ల‌క్ష‌లు అంద‌చేస్తామని చెప్పారు. కోలార్‌లో నిర్వహించిన ‘పంచ‌రత్న’ ర్యాలీలో కుమార‌స్వామి ఈ హామీ ఇచ్చారు.

‘‘రైతుల కొడుకులను పెళ్లి చేసుకునేందుకు యువ‌తులు సుముఖంగా లేర‌ని నా దృష్టికి వ‌చ్చింది. అందుకే రైతుల పిల్ల‌ల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చిన యువ‌తుల‌కు మా పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 ల‌క్ష‌ల న‌గ‌దు అందిస్తుంది’’ అని చెప్పారు. రైతుల పిల్లల ఆత్మ గౌర‌వాన్ని కాపాడేందుకు ఈ ప‌థకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.

క‌ర్ణాట‌క (Karnataka) అసెంబ్లీ ఎన్నిక‌లు మే 10న జ‌ర‌గ‌నున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. 224 స్ధానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కనీసం 123 స్థానాలను సాధించాలని జేడీ(ఎస్‌) టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటిదాకా 93 మంది అభ్యర్థులను ప్రకటించింది. పెళ్లికాని వాళ్లకు పిల్లను ఇచ్చే పధకాలను పెట్టె వరకు రాజకీయం వచ్చింది .

వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితాన్ని సమాజం అనుభవిస్తుంది. జీ డీ పి లో వ్యవసాయం వాటా తగ్గినప్పుడే రూపాయి పతనం ప్రారంభం అయింది. అయినప్పటికీ రైతుకు ప్రోత్సహం లేదు. గిట్టుబాటు ధర ఇవ్వరు. రుణాలు ఇవ్వరు. సబ్సీడీలు తగ్గించుకుంటూ ప్రభుత్వాలు వచ్చాయి. ఫలితంగా రైతుకు వ్యవసాయం మీద మోజు తగ్గింది. ఇతర రాగాల వైపు పిల్లల్ని మార్చారు. వ్యవసాయం చేసే వాళ్లకు పిల్లను ఇవ్వాలి అంటేనే వెనుకాడే సమాజాన్ని నిర్మించాం. ప్రమాదం గా మారిన ఈ పరిణామాన్ని మార్చడానికి జేడీఎస్ ఒక ప్రయత్నం పెళ్లిళ్ల విషయంలో చేసింది. కానీ , ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వ్యవసాయం చేసే వాళ్లకు విలువ ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే రైతుకు , ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.

కేవలం 2 లక్షల రూపాయల పరిహారం కోసం ఏ ఆడ పిల్ల వ్యవసాయం చేసే వాడిని చేసుకోవడానికి ముందుకు రాదు. జీవితాంతం బాధ పడాలి అనే భావం నుంచి రైతును బయటకు తీసుకు రావాలి . అప్పుడే పెళ్లికి పిల్లను ఇవ్వడానికి ముందుకొస్తారు. అసలైతే సమస్యను జెడీఎస్ గుర్తించింది. మిగిలిన పార్టీలు మరో అడుగు ముందుకేసి రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా మానిఫెస్టో రూపొందించాలని కోరుకుందాం.

Also Read:  Diabetes : ఉదయాన్నే ఈ ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లోకి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Election
  • india
  • jds
  • karnataka
  • Karnataka elections 2023
  • manifesto
  • marriage

Related News

America

America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

వాషింగ్టన్ న్యూఢిల్లీపై 50 శాతం భారీ టారిఫ్‌ను విధించిన సమయంలోనే భారత అధికారులు అమెరికాలో పర్యటించడం గమనార్హం. పెనాల్టీ ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చౌక చమురు కొనుగోలును కొనసాగిస్తోంది.

  • IND vs SL

    IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Gen Z Protest Possible Ktr

    Gen Z Protest Possible In India : భారత్లోనూ జన్జ ఉద్యమం రావొచ్చు – కేటీఆర్

Latest News

  • Floods In HYD : సీఎం రేవంత్ వల్లే నేడు హైదరాబాద్ జ‌ల దిగ్బంధం – హరీష్ రావు

  • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

  • Aqua Farmers : ఓ పక్క ట్రంప్..మరోపక్క ద‌ళారుల దోపిడీతో కుదేల్ అవుతున్న ఆక్వా రైతులు

  • Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

  • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd