PM MODI: వచ్చేనెల 8న హైదరాబాద్లో పర్యటించనున్న ప్రధానమంత్రి మోదీ
- By hashtagu Published Date - 10:07 AM, Mon - 27 March 23
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM MODI) వచ్చేనెల 8వ తారీఖున హైదరాబాద్ లో పర్యటిస్తున్న తెలంగాణ బీజేపీ తెలిపింది. మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపనతోపాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 700కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
కాగా జనవరిలోనే సికింద్రాబాద్, విశాఖ పట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభంతోపాటు , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల మోదీ పర్యటన వాయిదా పడటంతో… సికింద్రాబాద్, విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. అయితే తాజాగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించేందుకు మోదీ హైదరాబాద్కు రానున్నట్లు తెలంగాణ బీజేపీ తెలిపింది. జింఖాన మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. కాగా మోదీ సభకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 8న జరిగే భారీ బహిరంగ సభకు పెద్దెత్తున జనాలను పోగు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒకటే వందే భారత్ రైలు నడుస్తోంది. సికింద్రాబాద్, విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోంది. సికింద్రాబాద్ తిరుపతి రైలు ప్రారంభం అయితే తెలుగు రాష్ట్రాల్లో రెండవ వందే భారత్ రైలు అవుతుంది.
Tags
Related News
Lok Sabha Polls : నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని వెనక్కు పంపిన అధికారులు
నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది