South
-
AIADMK: అన్నాడీఎంకేకు షాక్..ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (టీవీకే) చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా
Date : 25-05-2026 - 4:34 IST -
Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళన.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం
చిక్కమగళూరులో రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చిక్కమగళూరు లో మాత్రం బీన్స్ వ్యాపారులు అత్యంత తక్కువ ధరలకు కొంటున్నారని రైతులు ఆరోపించారు. శనివారం రాత్రి చిక్కమగళూరులోని ఏపీఎంసీ యార్డు వద్ద వందలాది మంది రైతులు భారీ నిరసన చేపట్టి..ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం వేశారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తక్షణమే జ
Date : 24-05-2026 - 11:52 IST -
Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!
తమిళనాడులోని కోయంబత్తూర్లో ఘోరం జరిగింది. సూలూరు ఏరియాలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం చెరువు సమీపంలో మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. కఠిన శిక్షపడేలా చేస్తాం: విజయ్ ‘‘ఈ ఘ
Date : 23-05-2026 - 4:43 IST -
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పోస్ట్ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. Cockroach eating mangoes.. yummy 😜😜😜#CockroachJantaParty #justasking pic.twitter.com/8oEseWgqtF — Prakash Raj (@prakashraaj) May 22, 2026 ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ [&helli
Date : 22-05-2026 - 5:03 IST -
Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్య ప్రజలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఒక సమన్వయ యంత్రాంగాన్ని రూపొందించాలని నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రులందరితో తక్షణమే ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ
Date : 22-05-2026 - 4:21 IST -
Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్పై ఎక్స్ వేదికగా రచ్చ
లోక్సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కౌంటర్.. లోకేశ్ అంతే ఘాటుగా రీకౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. లోకేశ్ ఏమన్నారు? ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేశ్ కేంద
Date : 22-05-2026 - 11:48 IST -
Vijaya Sai Reddy: తమిళనాడు రాజకీయాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
తమిళనాడులో మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్తో పాటు తొమ్మిది మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 23 మందికి మంత్రులుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ అవకాశం ఇచ్చారు. ఈ కేబినెట్ కూర్పు, ప్రమాణ స్వీకారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. Today’s oath-taking ceremony of Tamil Nadu’s new Ministers will stand as a […]
Date : 22-05-2026 - 9:47 IST -
Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్ మార్క్ పాలన ఇదే
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సచివాలయంలో పని సంస్కృతి పూర్తిగా మారుతోంది. ఆయన సమయపాలనను కచ్చితంగా పాటించడం ప్రభుత్వ శాఖలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు విభాగాల్లో ఉద్యోగుల హాజరుపై కఠిన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కార్యాలయాల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రక
Date : 21-05-2026 - 10:14 IST -
Cm Vijay: లంచం అడిగితే..? సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడులో అవినీతిని సమూలంగా నిర్మూలించే దిశగా నూతన ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే అధికారుల వివరాలను వీడియో ఆధారాలతో పట్టిస్తే, ఫిర్యాదు చేసిన వారికి ఏకంగా లక్ష రూపాయల రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం రాష్ట్రంలో అవినీతిపై పోరాటంలో ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారి కనీసం వెయ్యి రూపాయల లంచం
Date : 20-05-2026 - 12:44 IST -
Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు
సాధారణంగా అల్లుడికి బట్టలు, ఉంగరాలు గిఫ్ట్గా ఇస్తారు. మన తెలుగు వాళ్లైతే వందల రకాల వంటకాలతో కడుపు నింపుతారు. కానీ మహారాష్ట్రలో మాత్రం ఓ అత్తింటివారు ఏకంగా వెండి చెప్పులు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయ పండుగ వేళ అల్లుడికి ఇచ్చిన ఆ లగ్జరీ కానుక ముచ్చట్లేంటో చూద్దాం.. కానుక ఎందుకంటే మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ వ్యక్తి తన అల్లుడి కోసం ప్రత్యేక బహుమతి ప్లాన
Date : 20-05-2026 - 11:56 IST -
Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు
వేసవి వచ్చిందంటే చాలు బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. మండుటెండల్లో చల్లచల్లని బీర్ తాగేందుకు చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా యువత ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇటీవల కాలంలో ఆల్కహాల్ ధరలు బాగా పెరగడంతో చాలామంది బీర్లకు దూరమయ్యారు. ఇలాంటివారికి తాజాగా గుడ్ న్యూస్ అందింది. ఒక్కో బీర్ పై ఏకంగా రూ.20 నుండి రూ.75 వరకు తగ్గింది. సరిగ్గా వేసవి ఎండలు ముదిరిన వేళ ఇలా ధరలు తగ్గించడంతో మంద
Date : 19-05-2026 - 4:27 IST -
Extra Marital Affair: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన భార్య
దేశ రాజధాని ఢిల్లీలో మానవ సంబంధాల విలువలను నడిరోడ్డుపై తగలబెట్టేలా అత్యంత క్రూరమైన, భయానకమైన ఘటన చోటుచేసుకుంది. తన భార్యకు ఉన్న వివాహేతర సంబంధం గురించి నిలదీసినందుకు, ఆ భార్య తన తల్లితో కలిసి భర్తపైనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని నార్త్ వెస్ట్ జిల్లా జహంగీర్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఉదంతం వెలుగుచూసిం
Date : 19-05-2026 - 12:24 IST -
Cm Vijay: ఆరు నెలల్లో విజయ్ ప్రభుత్వం కూలిపోతది.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి ప్రభుత్వం ఆరు నెలలు కూడా అధికారంలో కొనసాగలేదని డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ త్వరలోనే మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తమిళనాడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృ
Date : 18-05-2026 - 11:39 IST -
Cm Vijay: కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు.. సీఎం విజయ్ మార్క్ పాలిటిక్స్..
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం పంపారు. తన అధికారిక కుర్చీపై అలంకరించే తెల్ల టవల్ను తొలగించి, బ్రిటిష్ కాలం నాటి వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికారు. ఈ మార్పు ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా నిశ్శబ్దంగా జరగడం గమనార్హం. మే 14న పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో విజయ్ కుర్చీపై టవల్ ఉండగా, మే 15న టాఫే ఛైర్పర్సన్ మల్లికా శ్రీనివాసన్తో
Date : 16-05-2026 - 5:08 IST -
Crime News: గ్వాలియర్ లో బాలికపై అత్యాచారం
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కిడ్నాప్కు గురైన బాలికపై బెంగళూరులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణమైన కేసులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ఏడాది జనవరిలో గ్వాలియర్కు చెందిన బాలికను నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలించారు. బాలిక కని
Date : 16-05-2026 - 11:14 IST -
Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో, ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం అంటే ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదని అర్థం కాదని
Date : 15-05-2026 - 1:39 IST -
Cm Vijay: మోదీకి సీఎం విజయ్ లేఖ
తమిళనాడులోని టెక్స్టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, దానిని ఆదుకునేందుకు పత్తిపై ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి విజయ్.. ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. పత్తి, నూలు ధరలు విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలోని టెక్స్టైల్ రంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “తమిళనాడు, దేశంలో
Date : 15-05-2026 - 10:24 IST -
Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఇవాళ శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ మేరకు ఆయన సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ బలపరీక్ష, అన్నాడీఎంకేలో పెరుగుతున్న విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. విజయ్ తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస
Date : 13-05-2026 - 11:23 IST -
CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి
తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఓ కీలక నియామకం చేపట్టింది. ముఖ్యమంత్రి విజయ్ తన రాజకీయ వ్యవహారాల కోసం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా తన అత్యంత సన్నిహితుడు, జ్యోతిష్కుడు, పార్టీ అధికార ప్రతినిధి అయిన రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ
Date : 12-05-2026 - 5:17 IST -
Liquor Shops: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు-రాజకీయవేత్త జోసెఫ్ విజయ్, తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను (టాస్మాక్) తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రక
Date : 12-05-2026 - 9:29 IST