youngest councillor: ఈ చెన్నై యువతి.. ‘యంగెస్ట్ కౌన్సిలర్’ గా రికార్డ్!
ఆమెకు చిన్నప్పట్నుంచే రాజకీయాలు అంటే ఎంతో ఇష్టం. తండ్రి అడుగుజాడల్లో అడుగులు వేసి రాజకీయాన్ని ఒంటపట్టించుకుంది. ఓవైపు చదువుతూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేది.
- By Balu J Published Date - 01:45 PM, Fri - 25 February 22
ఆమెకు చిన్నప్పట్నుంచే రాజకీయాలు అంటే ఎంతో ఇష్టం. తండ్రి అడుగుజాడల్లో అడుగులు వేసి రాజకీయాన్ని ఒంటపట్టించుకుంది. ఓవైపు చదువుతూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేది. ఫలితంగా 21 ఏళ్ల వయసులోనే కౌన్సిలర్ అవతారమెత్తి రికార్డుకెక్కింది. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ ప్రియదర్శిని తన వార్డులో నిత్యం ఎదుర్కొంటున్న నీటి కష్టాలను తీరుస్తానని భరోసా అందించింది. ‘‘ప్రస్తుతం నా వార్డులోని 42,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్లంతా తమ తాగునీటి అవసరాల కోసం లారీలు, వాటర్ క్యాన్లపై ఆధారపడుతున్నారు. వీటి అన్నింటికి చెక్ పెట్టి నీటి కష్టాలు తీర్చాలనుకుంటున్నా’’ అని అంటోంది. చెన్నై కార్పొరేషన్కు ఎన్నికైన కౌన్సిలర్గా ఈ 21 ఏళ్ల యువతి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయబడిన తేనాంపేటలోని 98వ వార్డు నుంచి ఆమె పోటీ చేశారు. ప్రియ 5,253 ఓట్ల తేడాతో గెలిచారు. ఆమె పార్టీ, CPI(M), DMK, కాంగ్రెస్, DMDK, IUML (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్) మొదలైన వాటితో పొత్తు పెట్టుకుంది.
” మా నాన్న ఆటో డ్రైవర్. ఎన్నో ఏళ్లుగా పార్టీలో బేరింగ్ మెంబర్గా పనిచేస్తున్నారు. నాకు చిన్నప్పటి నుండి సీపీఐ(ఎం) పట్ల అభిమానం ఏర్పడింది” అని ఆమె చెప్పింది. స్టెల్లా మారిస్ కాలేజీలో సోషియాలజీలో బీఏ చేసిన రోజుల్లో కూడా ప్రియ విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉండేది. ఆమె స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI, CPI(M) విద్యార్థి విభాగం)లో సభ్యురాలు. తర్వాత CPI(M) యువజన విభాగం అయిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI)లో చేరారు.
2022 స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈమెను పోటీ చేయాలని పార్టీ కోరినప్పుడు ప్రియ వెనుకాడలేదు. “ ప్రజలకు సేవ చేయడం నాకు చాలా ఇష్టం. మా నాన్న కూడా చిన్నప్పటి నుండే అదే పని చేయడం చూస్తున్నాను. కాబట్టి ఎన్నికల్లో నిలబడటం, ప్రజా సేవకురాలిగా పనిచేయడం సంతోషాన్ని కలిగించే విషయం’’ అని అమె వెల్లడించింది.
Tags
Related News
CISF Man shoots: కదులుతున్న బస్సులో తుపాకీతో కాల్చుకున్న CISF ఉద్యోగి
చెన్నైలో సిఐఎస్ఎఫ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే కదులుతున్న బస్సులోనే ఈ దారుణ ఘటనకు పాల్పడటం వెనుక అధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.