Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!
ప్రేమకు వయసుతో, మనుషుల మధ్య దూరంతో సంబంధం లేదు అని అంటూ ఉంటారు. ఈ ప్రేమ అనే రెండు అక్షరాల
- By Nakshatra Published Date - 10:05 AM, Fri - 12 August 22
ప్రేమకు వయసుతో, మనుషుల మధ్య దూరంతో సంబంధం లేదు అని అంటూ ఉంటారు. ఈ ప్రేమ అనే రెండు అక్షరాల పదం ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో చెప్పడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ ప్రేమ అనే పదం కోసం చాలామంది ఎంత దూరమైనా వెళ్లడానికి వెనకాడరు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ అబ్బాయిని ఒక పాకిస్తాన్ అమ్మాయి ప్రేమించింది. చివరికి ఇండియాకు వస్తూ దొరికిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..ఆమె పేరు కలీజా నూర్ పాకిస్థాన్ లోని ఫైసలాబాద్. అతడి పేరు అహ్మద్ తెలంగాణలోని హైదరాబాద్. ఇద్దరూ ఆన్ లైన్ లో ఒకరికొకరు పరిచయమయ్యారు.
అలా వారిమధ్య మెల్లగా మాటలు కలిసి, ప్రేమగా మారింది. అలా వారిద్దరు పెళ్లి చేసుకుని కలిసి కాలనీ అనుకున్నారు. అందుకుఆ ఆమె కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించకపోవడంతో కలీజా నూర్ పాకిస్థాన్ నుంచి ఇండియా వచ్చేసేందుకు సిద్ధం అయ్యింది. హైదరాబాద్ లోని ఆమె ప్రియుడు అహ్మద్ ఇందుకోసం పెద్ద ప్లానే వేశాడు. తన సోదరుడు మహమూద్ సహకారంతో ఆమె హైదరాబాదీ అనిపించేలా నకిలీ ఆధార్ సహా ఇతర పత్రాలూ సృష్టించాడు. నేపాల్ మీదుగా ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ భారత్ నేపాల్ సరిహద్దుల్లో బిహార్ లోని సుర్సంద్ వద్ద ఆ యువతి, అక్రమంగా ఇండియాలోకి రావడానికి సహకరిస్తున్న మరో ఇద్దరు సైన్యానికి పట్టుబడ్డారు.
సైన్యం వారిని స్థానిక పోలీసులకు అప్పగించింది. ఈ మొత్తం వ్యవహారం వివరాలను సుర్సంద్ జిల్లా ఎస్పీ హర్ కిషోర్ రాయ్ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన మహమూద్ అహ్మద్ కొంత కాలం సౌదీ అరేబియాలోని ఓ హోటల్ లో పనిచేశాడని అక్కడ పనిచేసిన నేపాల్ స్నేహితుల సాయంతో కలీజా నూర్ ను అక్రమంగా ఇండియాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడని ఎస్పీ తెలిపారు. కలీజా నూర్ కు అవసరమైన నకిలీ ఆధార్, ఇతర పత్రాలను హైదరాబాద్ లోని మహమూద్ అహ్మద్, మరికొందరు కలిసి సృష్టించారని తెలిపారు. కలీజా నూర్ దుబాయ్ మీదుగా నేపాల్ కు చేరుకోగా.. అక్కడి నుంచి మహమూద్ తోపాటు జీవన్ అనే వ్యక్తి ఆమెను ఇండియాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ.. సరిహద్దుల్లో పట్టుబడ్డారని తెలిపారు.
Related News
Hanuman: భాగ్యనగరంలో మార్మోగిన హనుమాన్ నామస్మరణ, పాల్గొన్ననేతలు
Hanuman: హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు. ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన కోనే�