Shivraj Singh Chauhan: శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవికి రాజీనామా.. మహిళలు భావోద్వేగం
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
- By Praveen Aluthuru Published Date - 07:41 PM, Tue - 12 December 23

Shivraj Singh Chauhan: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మోహన్ యాదవ్ పేరును ప్రకటించిన వెంటనే శివరాజ్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా అనంతరం ఆయనను కలిసేందుకు వచ్చిన కొందరు మహిళలు భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.
శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తన మహిళా మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో మహిళా మద్దతుదారులు భావోద్వేగానికి గురయ్యారు. . మరోవైపు, శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఉచితంగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేవాడిని. ఈ పథకం కింద నేను సోదరీమణుల జీవితాలను మెరుగుపరచగలిగానని అన్నారు.
బాబూ లాల్ గారి తర్వాత నేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టానని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. 2008, 2013లో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 2018లో సీట్లు తక్కువ వచ్చినా ఓట్లు ఎక్కువ వచ్చాయన్నారు. ప్రధాని మోదీ, కేంద్రం ప్రవేశపెట్టిన పథకం, లాడ్లీ బహనా పథకం వల్లే ప్రభుత్వం ఏర్పడిందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
Also Read: Ration Cards: కాంగ్రెస్ పథకాలు అందాలంటే రేషన్ కార్డులు జరీ చేయాలి