Arvind Kejriwal: ఈ రోజు ఈడీ విచారణకు కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. గత గురువారం ఈడీ సీఎం కేజ్రీవాల్కు 7వ సారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 26 న విచారణలో పాల్గొనవలసిందిగా కోరింది.
- By Praveen Aluthuru Published Date - 09:59 AM, Mon - 26 February 24
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. గత గురువారం ఈడీ సీఎం కేజ్రీవాల్కు 7వ సారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 26 న విచారణలో పాల్గొనవలసిందిగా కోరింది. ఇంతకు ముందు కేజ్రీవాల్కు ఈడీ ఆరుసార్లు సమన్లు పంపినప్పటికీ సీఎం కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఇది చట్టవిరుద్ధమని పేర్కొంది. అయితే ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు అంటూ కేజ్రీవాల్ ఆరోపిస్తూ వస్తున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. కేజ్రీవాల్కు 7వ సమన్లు పంపి, ఫిబ్రవరి 26వ తేదీన విచారణలో పాల్గొనాలని కోరింది. ఇంతకు ముందు, సీఎం కేజ్రీవాల్ చాలా సందర్భాలలో ఈడీ ముందు హాజరు కాలేదు. ఈడీ ఏడో సమన్లపై ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ న్యాయపరమైన సంప్రదింపుల తర్వాత సమన్లకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో ఈడీకి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరికొద్ది రోజుల్లో సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసే అవకాశం ఉందని పలువురు ఢిల్లీ మంత్రులు పేర్కొన్నారు.
బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయని, మార్చి 16 వరకు సమయం కావాలని అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో ప్రస్తావించారని మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. దీనికి కోర్టు కూడా అనుమతించింది. ఇప్పుడు మళ్లీ ఈడీ సమన్లు జారీ చేసింది. ఏజెన్సీ షరతులు పాటించాల్సి వస్తే అసలు కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. మేము కోర్టుకు వెళ్లలేదు, ఈడీ కోర్టుకు వెళ్లినట్లు ఆప్ వర్గాలు చెప్తున్నాయి.
Also Read: Weather Forecast: వాతావరణంలో గణనీయమైన మార్పులు.. ఐఎండీ కీలక సూచనలు..!
Related News
Delhi Excise Case: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని స్థానిక కోర్టు శుక్రవారం మే 8 వరకు పొడిగించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారిస్తున్న ఇదే కేసులో సమాంతర కేసులో సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని అదే కోర్టు బుధవారం మే 7 వరకు పొడిగించింది.