Murder : ఇంటికి ఆలస్యంగా రావొద్దన్న భార్యను..?
బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. బేగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడేశ్వరినగర్లో...
- By Prasad Published Date - 10:45 AM, Thu - 29 September 22
బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. బేగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడేశ్వరినగర్లో భార్యను గొంతుకోసి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. మను అనే వ్యక్తి తన భార్య సంగీత (28)ని హత్య చేశాడు. మను ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ సి.కె. బాబా తెలిపారు. రాత్రి 7.30 గంటలకు మను తన భార్యను ఇంటి నుండి బయటకు తీసుకురావడాన్ని తాను చూశానని, ఆమెకు గుండెపోటు వచ్చిందని, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు ఇరుగుపొరుగు వారికి తెలియజేసినట్లు మను ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు, అక్కడ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారు. ఆదివారం మహాలయ అమావాస్య కారణంగా మను ఇంటికి త్వరగా వస్తాడని సంగీత భావించింది. కానీ అతను సూర్యాస్తమయం తర్వాత ఇంటికి చేరుకున్నాడు. సంగీత ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు అభ్యంతరం చెప్పింది. దీని తరువాత, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో మను ఆమె తలను గోడకేసి కోట్టాడు. ఆ తరువాత ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. విచారణలో సంగీతను హత్య చేసినట్లు మను అంగీకరించాడు. తొమ్మిది నెలల క్రితమే తనకు వివాహమైందని మను పోలీసులకు తెలిపాడు.
Related News
Free Screen Replacement : ఆ ఫోన్లు వాడుతున్నారా ? ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్
Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ? అయితే మీకే ఈ శుభవార్త.