Unmarried Mother Throws NewBorn: హృదయ విదారక ఘటన.. శిశువును మూడో అంతస్తు నుంచి విసిరేసిన తల్లి
తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లికాని తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మూడో అంతస్తు నుంచి కిందకు (Throws NewBorn)తోసేసింది. పెళ్లి కాకుండానే ప్రసవించిన యువతి, అప్పుడే పుట్టిన పసికందును అపార్ట్మెంట్లోని మూడో అంతస్తు నుంచి విసిరేసింది.
- By Gopichand Published Date - 09:26 AM, Tue - 10 January 23
తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లికాని తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మూడో అంతస్తు నుంచి కిందకు (Throws NewBorn)తోసేసింది. పెళ్లి కాకుండానే ప్రసవించిన యువతి, అప్పుడే పుట్టిన పసికందును అపార్ట్మెంట్లోని మూడో అంతస్తు నుంచి విసిరేసింది. ఢిల్లీలోని న్యూఅశోక్నగర్లో ఉన్న అపార్ట్మెంట్ వద్ద పైనుంచి ఏదో వస్తువు కిందపడినట్లు శబ్దం వినిపించింది. మహిళలు వెళ్లి చూడగా శిశువు రక్తమోడుతూ కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతోనే శిశువును కిటికీలోంచి పడేసినట్లు నిందితురాలు చెప్పింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నవజాత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎల్బీఎస్ మార్చురీకి తరలించారు. హత్య, సాక్ష్యాల ధ్వంసం కేసు నమోదు చేసి 20 ఏళ్ల బాలికను పోలీసులు గుర్తించారు. బాలిక కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. న్యూ అశోక్ నగర్లోని జై అంబే అపార్ట్మెంట్లో సోమవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో ఓ పసికందును కింద పడేసినట్లు పోలీసులకు సమాచారం అందిందని తూర్పు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమృత గూగులోత్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి చిన్నారిని మెట్రో ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. అక్కడికి చేరుకోగా చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Also Read: Brazil Former President: ఆస్పత్రిలో చేరిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు.. కారణమిదే..?
అపార్ట్మెంట్లో చలి నుంచి కాపాడుకోవటానికి ఆమె చేతులు కాల్చుకుందని ప్రత్యక్ష సాక్షులు ముగ్గురు మహిళలు చెప్పారు. ఇంతలో ఏదో కిందపడిన శబ్దం వినిపించింది. ఎవరో కావాలనే పిల్లాడిని విసిరేసినట్లు అనిపించింది. పొగమంచు కారణంగాపసికందుని పైనుండి కిందకు పడేసిందెవరో తెలియరాలేదు. పోలీసులు వెంటనే అపార్ట్మెంట్లో విచారణ ప్రారంభించారు. మూడో అంతస్థులోని ఒక ఫ్లాట్ బయట రక్తపు మరకలున్న కొన్ని బట్టలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు ఇంటికి వెళ్లి విచారించగా.. ఫ్లాట్లో నివాసముంటున్న 20 ఏళ్ల ప్రియ ఆదివారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తేలింది. అమ్మాయి నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఓ యువకుడితో స్నేహం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. తరువాత ఆమె గర్భస్రావం కాలేదు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సమాజానికి భయపడి చంపేయాలని నిర్ణయించుకుని మూడో అంతస్తులోని బాత్రూమ్ నుంచి కిందకు తోసేసింది. పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై హత్య, సాక్ష్యాధారాల ధ్వంసం కేసు నమోదు చేశారు. పోలీసులు తల్లిదండ్రులను విచారించి, ఈ ఘటనలో వీరి హస్తం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Related News
Hanuman Jayanti 2024: ఢిల్లీలోని 5 పురాతన హనుమాన్ దేవాలయాలు…వాటి ప్రత్యేకత
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈసారి ఏప్రిల్ 23 మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున బజరంగబలి ఆశీస్సులు పొందాలనుకుంటే కచ్చితంగా ఈ కథనం చదవాల్సిందే.