అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం.. భారత్కు బ్యాడ్ న్యూస్!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ కొనుగోలుదారులలో ఒకటైన భారత్కు ఇది చాలా ఆందోళనకరమైన విషయం. భారత్ తన ఎల్పీజీ (LPG) అవసరాల కోసం 80-85 శాతం ఖతార్పైనే ఆధారపడి ఉంది.
- Author : Gopichand
Date : 19-03-2026 - 6:59 IST
Published By : Hashtagu Telugu Desk
UAE-Qatar Oil Facility: మూడు వారాల క్రితం ఇజ్రాయెల్ మొదటి క్షిపణి ఇరాన్ భూభాగంపై పడటంతో ప్రపంచం మరో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన సైనిక ఘర్షణ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. గత 24 గంటల్లో ఈ యుద్ధం ‘చమురు యుద్ధం’గా రూపాంతరం చెందింది. బుధవారం నాడు ఇరుపక్షాలు మొదటిసారిగా శిలాజ ఇంధన ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేయడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లో తీవ్ర కలకలం రేగింది. ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో ఇప్పుడు ‘ఇంధనం’ ఒక ఆయుధంగా మారింది.
‘చమురు యుద్ధం’గా మారిన మిడిల్ ఈస్ట్ జంగ్
మార్చి 17 వరకు అమెరికా, ఇజ్రాయెల్ గల్ఫ్ ప్రాంతంలోని ఈరాన్ ఇంధన ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఈరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం వాటా ఉన్న ‘ఖార్గ్ ఐలాండ్’పై జరిగిన దాడిలో కూడా కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నారు. కానీ బుధవారం ఇజ్రాయెల్, ఇరాన్, ఖతార్ మధ్య ఉమ్మడిగా ఉన్న ‘సౌత్ పార్స్’ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేసింది. దీనికి ప్రతికారంగా ఇరాన్.. సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో రిఫైనరీ.. ఖతార్, యూఏఈ గ్యాస్ కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.
సౌత్ పార్స్ ప్రత్యేకత ఏమిటి?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో సౌత్ పార్స్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ మాత్రమే కాదు, ప్రపంచ ఎల్ఎన్జీ (LNG) సరఫరాకు వెన్నెముక వంటిది. ఇందులో భారత్ వాటా కూడా గణనీయంగా ఉంది. ఇజ్రాయెల్ దాడి తర్వాత చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ‘రాయిటర్స్’ ప్రకారం.. ఇందులో 1,800 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఇవి ప్రపంచ అవసరాలను 12-13 ఏళ్ల పాటు తీర్చగలవు. ఇరాన్కు ఇది విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు. ఎందుకంటే ఆ దేశంలోని 80 శాతం విద్యుత్ ఇక్కడి నుండే వస్తుంది. ఖతార్ వాటాను ‘నార్త్ ఫీల్డ్’ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారు.
Also Read: బీసీసీఐ ముందు అజిత్ అగార్కర్ బిగ్ రిక్వెస్ట్.. ఏంటంటే?
యూఏఈ, ఖతార్ చమురు ప్లాంట్లపై దాడి
ఇరాన్.. ఖతార్కు చెందిన రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్, యూఏఈకి చెందిన హబ్షాన్ గ్యాస్ ప్లాంట్, బాబ్ ఆయిల్ ఫీల్డ్లను లక్ష్యంగా చేసుకుంది. చాలా క్షిపణులను గాలిలోనే కూల్చివేసినప్పటికీ యూఏఈ దీనిని ‘ఉగ్రవాద దాడి’గా అభివర్ణించింది. సౌదీలోని యంబు ఓడరేవు వద్ద ఉన్న అరామ్కో రిఫైనరీ దెబ్బతింది. ఇది హోర్ముజ్ జలసంధి మూసివేయబడినప్పుడు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గంగా ఉండేది. కువైట్ లోని మినా అల్-అహ్మదీ రిఫైనరీలో కూడా మంటలు చెలరేగాయి. అయితే నష్టం పరిమితంగానే ఉంది. అంతకుముందే అబుదాబిలోని షా గ్యాస్ ఫీల్డ్పై జరిగిన డ్రోన్ దాడి వల్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఇది ప్రపంచ సల్ఫర్ సరఫరాలో 8 శాతాన్ని అందిస్తుంది.
భారత్కు ఇది ఎందుకు చెడ్డ వార్త?
ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ కొనుగోలుదారులలో ఒకటైన భారత్కు ఇది చాలా ఆందోళనకరమైన విషయం. భారత్ తన ఎల్పీజీ (LPG) అవసరాల కోసం 80-85 శాతం ఖతార్పైనే ఆధారపడి ఉంది. దీనివల్ల ఫెర్టిలైజర్ ప్లాంట్లు, సిటీ గ్యాస్ నెట్వర్క్ (PNG-CNG) ప్రభావితమవుతాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 110 డాలర్లకు చేరుకోగా, గ్యాస్ ధరలు 6 శాతం పెరిగాయి. ఎల్ఎన్జీ కేంద్రాల మరమ్మతులకు ఏళ్ల సమయం పడుతుందని, 2003 ఇరాక్ యుద్ధంలో కూడా ఇలాగే జరిగిందని విశ్లేషకుడు సౌల్ కావొనిక్ పేర్కొన్నారు.