PM Modi- Giorgia Meloni: ఇటలీ ప్రధాని మెలోని కి.. మోడీ స్పెషల్ గిఫ్ట్..
- Author : Vamsi Chowdary Korata
Date : 20-05-2026 - 2:20 IST
Published By : Hashtagu Telugu Desk
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను నెటిజన్లు సరదాగా ‘మెలోడి’ అని పిలుస్తుంటారు. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ క్రేజ్ను మోదీ భలే వాడుకున్నారు. తన ఇటలీ పర్యటనలో భాగంగా మెలోనికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అందరినీ నవ్వించారు.
స్వీట్ గిఫ్ట్
ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్నారు మోదీ. ఈ సందర్భంగా మెలోనిని కలిసిన ఆయన.. భారత్లో ఎంతో పాప్యులర్ అయిన ‘పార్లే మెలొడీ’ చాక్లెట్ ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు. ఇద్దరు నేతల పేర్లను కలిపి ఇంటర్నెట్లో నడుస్తున్న ట్రెండ్ను దృష్టిలో పెట్టుకుని మోదీ ఈ సరదా గిఫ్ట్ ప్లాన్ చేశారు.
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
వీడియో వైరల్
ఈ చాక్లెట్ ప్యాకెట్ను అందుకున్న మెలోని.. ప్రధాని మోదీతో కలిసి దిగిన ఒక చిన్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ‘బహుమతికి చాలా థాంక్స్’ అని ఆమె రాశారు. వీడియోలో మెలోని మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ నాకోసం చాలా మంచి టోఫీలు తెచ్చారు’ అనగానే, పక్కనే ఉన్న మోదీ నవ్వుతూ ‘మెలొడీ’ అని అన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గంట వ్యవధిలో లక్షకు పైగా లైక్స్, దాదాపు 9,000 కామెంట్స్, 25 వేలకు పైగా షేర్స్ వచ్చాయి.
కార్ డిప్లొమసీ
రోమ్ చేరుకున్న మోదీకి మెలోనీ ఘన స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి కార్లో ప్రయాణిస్తూ నగర వీధుల్లో సందడి చేశారు. తర్వాత రాత్రి పూట రోమ్లోని ప్రసిద్ధ చరిత్రాత్మక కట్టడం కొలోసియంను సందర్శించారు. అక్కడ కాసేపు నడుస్తూ ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు.
బహుమతిగా కాశీ చిత్రం
ఈ పర్యటనలో మోదీని ఇటలీకి చెందిన ప్రముఖ చిత్రకారుడు జాంపాలో టొమాసెట్టి కలిశారు. ఆయన స్వయంగా గీసిన వారణాసి (కాశీ) పెయింటింగ్ను మోదీకి బహుమతిగా ఇచ్చారు. టొమాసెట్టికి భారతీయ సంస్కృతిపై ఉన్న ఇష్టాన్ని మోదీ ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. రోమ్ నగరంలో కాశీ దృశ్యాలను చూడటం ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు.