Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్తానీ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
- By Gopichand Published Date - 06:29 AM, Wed - 4 October 23
Trudeau: ఖలిస్తానీ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని ట్రూడో మాట్లాడుతూ.. భారత్ తో వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం మాకు ఇష్టం లేదని ట్రూడో పేర్కొన్నారు. కెనడా.. భారత్తో వివాదాన్ని పెంచుకోవడం ఇష్టం లేదని జస్టిన్ ట్రూడో అన్నారు. ఇది న్యూఢిల్లీతో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా కొనసాగుతుంది. భారతదేశంలోని కెనడియన్ కుటుంబాలకు సహాయం చేయడానికి మేము అక్కడ ఉండాలనుకుంటున్నామని ఆయన అన్నారు.
40 మంది దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం కెనడాను కోరిందని, లేకుంటే దౌత్యవేత్తలకు ఇచ్చిన రక్షణ శక్తి రద్దు చేయబడుతుందని మంగళవారం వర్గాలు తెలిపిన సమయంలో ట్రూడో ఈ ప్రకటన వచ్చింది. ఢిల్లీలో తమ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడా ప్రభుత్వానికి భారత్ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఈనెల 10లోగా 40 మంది కెనడా దౌత్య సిబ్బంది భారత్ను విడిచి వెళ్లాల్సిందిగా తేల్చిచెప్పింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఒట్టావాకు భారత్ సూచించినట్లు తెలుస్తుంది. కెనడాలో భారత్లో అవసరమైన దానికంటే ఎక్కువ మంది దౌత్యవేత్తలు ఉన్నారని, అందువల్ల సమతుల్యతను సృష్టించాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల పేర్కొంది. నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో చేసిన సంచలన ఆరోపణలతో ఈ వివాదానికి తెరలేచింది.
We’re now on WhatsApp. Click to Join
భారత్, కెనడా మధ్య వివాదం ఎలా మొదలైంది?
ఇటీవల నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో పేర్కొనడంతో భారతదేశం, కెనడా మధ్య వివాదం బహిరంగంగా తెరపైకి వచ్చింది. భారత ప్రభుత్వం ఈ వాదనపై తీవ్రంగా స్పందించింది. ఆరోపణలను నిరాధారమైనదిగా పేర్కొంది. ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని కూడా విదేశాంగ శాఖ పేర్కొంది. వేర్పాటువాదులకు కెనడా సురక్షిత స్వర్గధామంగా మారింది. కెనడా ప్రభుత్వం అటువంటి అంశాలపై చర్యలు తీసుకోలేదని భారతదేశం కూడా పేర్కొంది.
విదేశాంగ మంత్రి ఏమన్నారు..?
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల మాట్లాడుతూ.. “కెనడియన్లు కొన్ని ఆరోపణలు చేశారు. ఇది భారత ప్రభుత్వ విధానం కాదని మేము వారికి చెప్పాము. అయితే వారు సంబంధిత సమాచారాన్ని మాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంటే, మేము దానిని పరిశీలించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఎస్. జైశంకర్ అన్నారు.
Related News
PM Modi : వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోడీ
Prime Minister Modi nominated: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్(Nomination) దాఖలు చేశారు. మంగళవారం ఉదయం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యాక్రమానికి మోడీ వెంట 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా 12 రాష్ట్రాల సీఎం హాజరయ్యారు. పలువురు ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, టీడీప