PM Modi Warned Pakistan: పాకిస్థాన్కు ప్రధాని మోదీ హెచ్చరిక!
పీఎం మోదీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో శత్రువులకు నిద్ర లేకుండా చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ కొత్త చిరునామా ఇప్పుడు ఉత్తరప్రదేశ్. పెద్ద మెట్రో నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు ఇప్పుడు కాన్పూర్లో కూడా కనిపిస్తున్నాయి.
- By Gopichand Published Date - 05:41 PM, Fri - 30 May 25

PM Modi Warned Pakistan: శుక్రవారం కాన్పూర్ సందర్శన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్కు హెచ్చరిక (PM Modi Warned Pakistan) జారీ చేశారు. పీఎం మోదీ మాట్లాడుతూ.. మేము పాకిస్థాన్లో ఉగ్రవాదుల ఆస్తానాలను, వారి ఇళ్లలోకి చొచ్చుకెళ్లి, వందల మైళ్ల లోపలికి వెళ్లి నాశనం చేశాము. ఇక పాకిస్థాన్ రాష్ట్ర, రాష్ట్రేతర కారకాల ఆటలు ఇక నడవవు. కాన్పూర్ భాషలో సూటిగా చెప్పాలంటే, శత్రువు ఎక్కడ ఉన్నా, అతన్ని హెచ్చరిస్తామని పేర్కొన్నారు.
మేక్ ఇన్ ఇండియా శక్తిని ప్రపంచం చూసింది- పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్పూర్లో 47,600 కోట్ల రూపాయల 15 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో శత్రువు (పాకిస్థాన్ను ఉద్దేశించి) వణికిపోయాడు. అతను ఎటువంటి భ్రమలో ఉండకూడదు. ఇది ఇంకా పూర్తి కాలేదు. ఆపరేషన్ సిందూర్లో ప్రపంచం భారతదేశ స్వదేశీ ఆయుధాల శక్తిని మరియు మేక్ ఇన్ ఇండియా బలాన్ని చూసింది. మన భారతీయ ఆయుధాలు, బ్రహ్మోస్ మిస్సైల్ శత్రువు ఇంట్లోకి చొచ్చుకెళ్లి ధ్వంసం చేశాయి. మేము నిర్ణయించిన లక్ష్యం ఎక్కడ ఉన్నా అక్కడే విధ్వంసం చేశామని తెలిపారు.
Also Read: Jurala Project : జూరాల ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ను ప్రారంభించాము
పీఎం మోదీ మాట్లాడుతూ..ఈ శక్తి మాకు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం నుండి లభించింది. ఒకప్పుడు భారతదేశం సైనిక అవసరాల కోసం, తన రక్షణ కోసం ఇతర దేశాలపై ఆధారపడేది. మేము ఆ పరిస్థితులను మార్చడానికి ప్రారంభించాము. భారతదేశం తన రక్షణ అవసరాల కోసం ఆత్మనిర్భర్గా ఉండాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థకు అవసరమే కాదు. దేశ ఆత్మగౌరవం కోసం కూడా అంతే అవసరం. అందుకే మేము ఆ ఆధారపడటం నుండి దేశాన్ని విముక్తి చేయడానికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ను ప్రారంభించామన్నారు.
ఉత్తరప్రదేశ్ రక్షణ రంగంలో పెద్ద పాత్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతలో పెద్ద పాత్ర పోషిస్తోందని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “కాన్పూర్లో ఉన్న పాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలాంటి 7 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మేము ఆధునిక కంపెనీలుగా మార్చాము. ఒకప్పుడు సంప్రదాయ పరిశ్రమలు వలస వెళుతున్న చోట, ఇప్పుడు రక్షణ రంగంలో పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఇక్కడ సమీపంలోని అమేఠీలో AK203 రైఫిల్ తయారీ ఇప్పటికే ప్రారంభమైంది అన్నారు.
‘బ్రహ్మోస్ మిస్సైల్ కొత్త చిరునామా ఇప్పుడు ఉత్తరప్రదేశ్’
పీఎం మోదీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో శత్రువులకు నిద్ర లేకుండా చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ కొత్త చిరునామా ఇప్పుడు ఉత్తరప్రదేశ్. పెద్ద మెట్రో నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు ఇప్పుడు కాన్పూర్లో కూడా కనిపిస్తున్నాయి. కాన్పూర్ మెట్రో దీనికి నిదర్శనం. సరైన ఉద్దేశాలు, బలమైన ఇచ్ఛాశక్తి, నీతిగల ప్రభుత్వం ఉంటే దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా నిజాయితీగా ప్రయత్నాలు జరుగుతాయో ఇది నిరూపిస్తుందన్నారు.