3D Ram Mandir : అయోధ్య రామమందిరం 3డీ ప్రతిమల సేల్స్ జూమ్
3D Ram Mandir : అయోధ్య రామమందిరంపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది.
- By Pasha Published Date - 12:01 PM, Sat - 30 December 23
3D Ram Mandir : అయోధ్య రామమందిరంపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. జనవరి 22న రామమందిరం ప్రారంభం కానున్న తరుణంలో 3డీ ప్రింటెడ్ అయోధ్య రామమందిరం ప్రతిమల సేల్స్ ఊపందుకున్నాయి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లోని పారిశ్రామిక పట్టణం ఘజియాబాద్లో రామాలయ 3డీ బొమ్మలు పెద్దసంఖ్యలో సేల్ అవుతున్నాయి. వీటితో పాటు తాజ్ మహల్, కుతుబ్ మినార్, ఇండియా గేట్, గేట్వే ఆఫ్ ఇండియా 3డీ ప్రతిమలు కూడా బాగానే అమ్ముడుపోతున్నాయి. ఇయర్ ఎండ్ కావడంతో సన్నిహితులకు గిఫ్టుగా ఇవ్వడానికి రామమందిరం 3డీ బొమ్మలను(3D Ram Mandir) ప్రజలు పెద్దఎత్తున కొంటున్నారని తయారీదారులు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
3డీ రామమందిరం ప్రతిమలను తయారు చేస్తున్న ఘజియాబాద్ వాసి రాహుల్ మహాజన్ మాట్లాడుతూ.. గత ఆరు నెలల్లో రామ మందిరం 3డీ బొమ్మలకు డిమాండ్ 100 శాతానికిపైగా పెరిగిందన్నారు. ఘజియాబాద్లోని ఫర్నీచర్ మార్కెట్లో ఉన్న తన ప్రింటింగ్ స్టూడియోలో వీటిని తయారు చేస్తున్నానని చెప్పారు. 3D ప్రింటింగ్ సాంకేతికత, లేజర్ కటింగ్ ప్రక్రియను ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. మెషీన్పై ఒక 3డీ ప్రింట్ తయారీకి ఐదు గంటల టైం పడుతోందన్నారు. ఆన్లైన్లో కూడా తమకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయని తెలిపారు.
Also Read: 274 Jobs : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 274 జాబ్స్
- ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ పర్యటిస్తున్నారు.
- ఆయన ప్రస్తుతం అయోధ్య రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు.
- దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్నారు.
- మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శన ఇస్తున్నారు.
- ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.
Related News
Ayodhya Ram Temple: మూడు నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా..?
జనవరి 22, 2024న రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.