Shashi Tharoor : సుంకాల యుద్ధం ఆపండి.. ట్రంప్కు శశిథరూర్ హెచ్చరిక
ఇప్పుడు అదే పరిస్థితి భారత్ విషయంలో తలెత్తకుండా చూసుకోవాలి. భారత్ను దూరం చేయడం అమెరికాకు భవిష్యత్తులో చేటు చేస్తుంది అని థరూర్ హెచ్చరించారు. అమెరికా ఇటీవల భారత్ దిగుమతులపై సుమారు 50 శాతం వరకు భారీ సుంకాలు విధించింది.
- Author : Latha Suma
Date : 04-09-2025 - 4:26 IST
Published By : Hashtagu Telugu Desk
Shashi Tharoor : అమెరికా భారత్పై అనుసరిస్తున్న సుంకాల విధానాన్ని వెంటనే మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ శశి థరూర్ హెచ్చరించారు. లేకపోతే, వచ్చే కాలంలో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని స్పష్టం చేశారు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం ద్వారా ఆయన ఈ మాటలు వెల్లడించారు. ఒకప్పుడు ‘చైనాను ఎవరు కోల్పోయారు?’ అనే ప్రశ్న అమెరికాలో చర్చకు దారి తీసింది. ఇప్పుడు అదే పరిస్థితి భారత్ విషయంలో తలెత్తకుండా చూసుకోవాలి. భారత్ను దూరం చేయడం అమెరికాకు భవిష్యత్తులో చేటు చేస్తుంది అని థరూర్ హెచ్చరించారు. అమెరికా ఇటీవల భారత్ దిగుమతులపై సుమారు 50 శాతం వరకు భారీ సుంకాలు విధించింది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
Read Also: Delhi Flood Situation : ఢిల్లీని ముంచెత్తిన వరదలు
ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ముఖ్యంగా శ్రమ ఆధారిత రంగాల్లో ఉద్యోగాలు నష్టమవుతున్నాయని చెప్పారు. ప్రతి దేశం తన స్వార్థాలకు అనుగుణంగా రక్షణ, ఇంధన ఒప్పందాలు చేసుకోవడం సహజం. అలాంటి నిర్ణయాలకు శిక్ష విధించడం ఓ మూర్ఖత్వం. ఇది అమెరికా అహంకారాన్ని చూపెడుతోంది అని థరూర్ విమర్శించారు. భారత్ వ్యూహాత్మకంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడాన్ని తిరుగుబాటుగా కాక, సార్వభౌమత్వంగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలా భారత్ను కోల్పోతే, అమెరికా లక్ష్యంగా పెట్టుకున్న ఇండో-పసిఫిక్ వ్యూహం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రత్యేకంగా, ఈ ఏడాది చివరిలో భారత్ ఆతిథ్యమివ్వాల్సిన ‘క్వాడ్’ శిఖరాగ్ర సమావేశం ముందు ఇలాంటి దూకుడు చర్యలు చర్చలకు అడ్డుకావొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ను ఒత్తిడికి గురిచేయడం వల్ల, అది చైనా, రష్యాలతో మరింత సన్నిహితంగా చేరే పరిస్థితిని తీసుకురాగలదని ఆయన విశ్లేషించారు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలను కూడా థరూర్ సూచించారు. భారత కార్మికులకు నష్టాన్ని కలిగించే సుంకాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు మళ్లీ ప్రారంభించాలి అని అన్నారు. అత్యున్నత స్థాయిలో దౌత్య చర్చలు జరగాలన్న ఆయన, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా భారత ప్రధాని మోదీతో మాట్లాడితే, సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శశి థరూర్ అమెరికా విధానాన్ని “తీవ్రమైన దెబ్బ” గా అభివర్ణించారు. ఈ విధానాలు దేశీయ పరిశ్రమలపై బరువైన ప్రభావాన్ని చూపుతుండగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై మరింత భారం పడుతోందని అన్నారు. భారత ప్రజలు ఇంకా వలస పాలనను మర్చిపోలేదు. మేం మా విదేశాంగ విధానాన్ని మరో దేశం నిర్ణయించాలన్న ఆలోచనను ఎప్పటికీ అంగీకరించం అని అల్ అరేబియా ఇంగ్లీష్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
Read Also: Red Color Radish : ఆరోగ్య రహస్యాల పూట..ఎరుపు ముల్లంగి ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుందని మీకు తెలుసా?