Duronto Express Fire: దురంతో ఎక్స్ప్రెస్లో మంటలు.. ప్రయాణికులు పరుగులు
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం దురంతో ఎక్స్ప్రెస్ కోచ్లలో ఒకదానిలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
- By Gopichand Published Date - 08:13 PM, Sun - 27 November 22
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం దురంతో ఎక్స్ప్రెస్ కోచ్లలో ఒకదానిలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విశ్వేశ్వరయ్య టెర్మినల్-హౌరా దురంతో ఎక్స్ప్రెస్లోని ఒక కోచ్లో కుప్పం రైల్వే స్టేషన్కు చేరుకోగానే పొగలు కనిపించాయి. రైలు ఆగిన వెంటనే కొందరు ప్రయాణికులు భయంతో దిగిపోయారు. అయితే రైలులో ఎలాంటి మంటలు లేవని, బ్రేక్ బ్లాక్కి రాపిడి వల్లే పొగ వచ్చిందని సౌత్ వెస్టర్న్ రైల్వే (ఎస్డబ్ల్యూఆర్) స్పష్టం చేసింది.
రైలు నెంబర్ 12246లో విశ్వేశ్వరయ్య టెర్మినల్-హౌరా దురంతో ఎక్స్ప్రెస్లో చిత్తూరు జిల్లా (బెంగళూరు డివిజన్/SWR) కుప్పం స్టేషన్కి చేరుకుంటున్నప్పుడు రైలు మేనేజర్ (గార్డ్) మధ్యాహ్నం 12.50 గంటలకు ఒక కోచ్ నుండి పొగలు రావడాన్ని గమనించారని SWR ఒక ప్రకటనలో తెలిపింది. ప్రామాణిక SOP ప్రకారం.. రైలు సిబ్బంది రైలును ఆపి తనిఖీ చేసారు. SE LWSCN 193669/S9 కోచ్లోని బ్రేక్ బ్లాక్ ఘర్షణ కారణంగా బ్రేక్ బైండింగ్ వలన పొగ వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఘటన స్థలానికి సిబ్బంది వెంటనే హాజరయ్యారని, రైలు మధ్యాహ్నం 1.33 గంటలకు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు అని అధికారులు చెప్పారు.
Tags
Related News
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఒకే యాప్లో అన్ని రకాల రైల్వే సేవలు..!
భారతదేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్ జరగనుంది. దీనికి ముందు రైల్వేకు సంబంధించి ఓ శుభవార్త బయటకు వస్తోంది.