Lok Sabha Polls 2024: లోక్సభ ఎన్నికలకు రాహుల్ ఇచ్చిన 5 హామీలు
రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు యువత ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఐదు వాగ్దానాలను ఆవిష్కరించింది. రాజస్థాన్లోని బన్వారాలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యువ న్యాయ పేరుతో 5 వాగ్దానాలను ప్రకటించారు.
- By Praveen Aluthuru Published Date - 10:17 PM, Fri - 8 March 24

Lok Sabha Polls 2024: రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు యువత ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఐదు వాగ్దానాలను ఆవిష్కరించింది. రాజస్థాన్లోని బన్వారాలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యువ న్యాయ పేరుతో 5 వాగ్దానాలను ప్రకటించారు. అధికారంలోకి వస్తే కీలకమైన సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ నిబద్ధతను వ్యక్తం చేశారు రాహుల్.
1. 30 లక్షల ప్రభుత్వ ఖాళీల భర్తీ:
30 లక్షల ప్రభుత్వ ఖాళీల సమస్యను పరిష్కరిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ స్థానాలను భర్తీ చేయడానికి తక్షణమే చర్యలు తీసుకుంటుందని ఉద్ఘాటించారు.
2. యువకులకు అప్రెంటిస్షిప్
దేశంలోని యువకులందరికీ అప్రెంటిస్షిప్ అవకాశం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అభ్యర్థులు ఒక ప్రైవేట్ కంపెనీ లేదా ప్రభుత్వ కార్యాలయంలో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్కు అర్హులని, దానితో పాటుగా రూ. 1 లక్ష స్టైఫండ్ ఇస్తామని చెప్పారు.
3. పేపర్ లీక్లకు వ్యతిరేకంగా చట్టం
ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు చట్టాన్ని అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
4. గిగ్ వర్కర్స్ కోసం సామాజిక భద్రతా హామీ
డ్రైవర్లు, గార్డులు మరియు డెలివరీ ఎగ్జిక్యూటివ్లతో సహా గిగ్ కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గిగ్ కార్మికులకు రక్షణ, పెన్షన్ మరియు సామాజిక భద్రతకు హామీ ఇచ్చారు.
Also Read: Realme 12: భారత్ లోకి మరో సరికొత్త రియల్ మీ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్?