Bharat Jodo Yatra : పాదయాత్ర ఫార్మూలా ఎవరెవరికీ వర్కౌట్ అయ్యింది..!
భారత్ జోడో యాత్ర వచ్చే లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ ను సమాయత్తం చేసేందుకు...
- By Prasad Published Date - 11:20 AM, Wed - 7 September 22
భారత్ జోడో యాత్ర వచ్చే లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ ను సమాయత్తం చేసేందుకు, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. 12 రాష్ట్రాల మీదుగా 3500 కి.మీ.ల పొడవునా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు (సెప్టెంబ్ 7 ) నుంచి కన్యాకుమారిలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. సుమారు 160 రోజులకు పైగా పాదయాత్ర చేసేందుకు రాహుల్ గాంధీ ప్రణాళికలు వేసుకున్నారు.
పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మాగాంధీ
వాస్తవానికి భారతదేశంలో ఆధునిక పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మాగాంధీ. 1930లో ఆయన ఉప్పు సత్యాగ్రహం పేరిట నిర్వహించిన పాదయాత్ర భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక మైలురాయి. ఆ తర్వాత ఆయన 1933-34లో అంటరానితనానికి వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్త పాదయాత్ర చేశారు.అనంతరం 1951లో వినోభా భావే భూదాన్ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి బిహార్లోని బోధ్గయ వరకు నడిచారు. 1983లో అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని చంద్రశేఖర్ ప్రజల కష్టసుఖాలు, దేశంలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఆరు నెలల పాటు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 4,260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
వైఎస్ఆర్ విజయంతో పాదయాత్ర ఫార్మూలా సక్సెస్
స్వాతంత్ర్యం తరువాత దివంగత సీఎం వైఎస్ఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలవారు, ఉద్యమకారులు వేర్వేరు కారణాలతో పాదయాత్రలు చేసినప్పటికీ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర వాటన్నికంటే భిన్నమైనది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003లో ఆయన ఈ యాత్ర చేపట్టారు. యాత్ర పూర్తయిన కొన్నాళ్లకే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అది మొదలు పాదయాత్రల ఫలాలపై నేతల్లో నమ్మకం పెరిగిపోయింది. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కాలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 2013లో పాదయాత్ర చేశారు. 2014లో ఆయన సీఎం అయ్యారు. వైఎస్ జగన్ కడపలోని ఇడుపుల పాయ దగ్గరి నంచి 2017లో పాదయాత్రను ప్రారంభించి..2019లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.
వైఎస్ ఫ్యామిలీకి పాదయాత్రలతో అనుబంధం
వైఎస్ ఫ్యామిలీలో ముగ్గురు పాదయాత్ర చేసి రికార్డులు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012 అక్టోబరు 18న ప్రారంభించి 2013 జులై 29 వరకు 230 రోజుల పాటు సుమారు 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.ఇప్పుడు వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ స్థాపించిన షర్మిలా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో 2016-17లో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సహా మరికొందరు నాయకులు కూడా సుమారు 4 వేల కిలోమీటర్ల మేర మహాజన పాదయాత్ర చేశారు. అయితే ఇప్పటి వరకు పాదయాత్రలు చేసిన నాయకులు ఎవరూ ఫెయిల్ కాలేదు. మరీ రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి పున:ర్ వైభవం తీసుకువస్తోందో వేచి చూడాల్సిందే మరీ…
Related News
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు..!
2024 లోక్సభ ఎన్నికల ఉత్కంఠ నేపథ్యంలో రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.