Kanchenjunga Express Crash: కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం
పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దీంతో పాటు కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
- Author : Vamsi Chowdary Korata
Date : 17-06-2024 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
Kanchenjunga Express Crash: పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దీంతో పాటు కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
“పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల సహాయం అందజేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు అందజేస్తారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం బాధాకరమని ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో రాశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రమాద స్థలానికి వెళ్తున్నారు.
రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో రైలు ప్రమాదంలో మరణించిన వార్త చాలా బాధాకరమని రాశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో సోమవారం భారీ రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. న్యూ జల్పైగురిలోని రంగపాణి స్టేషన్కు సమీపంలో వెనుక నుంచి వస్తున్న గూడ్స్ రైలు కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.
Also Read: Kalki 2898 AD : కల్కి టీం చేసే ఆలస్యాలకు అమితాబ్ కూడా దండం పెట్టేసారు.. ట్వీట్ వైరల్..