PM Modi Mann Ki Baat: తెలంగాణ నేత కార్మికుడిపై ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
- By Gopichand Published Date - 12:33 PM, Sun - 27 November 22
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మన్ కీ బాత్ 95వ ఎపిసోడ్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఒకప్పుడు చంద్రుడు, నక్షత్రాలను చూస్తూ ఆకారాలు తయారుచేసే పిల్లలు ఇప్పుడు భారతదేశంలోనే రాకెట్లను తయారు చేసే అవకాశం పొందుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అహ్మదాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ని విన్నారు. అదే సమయంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కూడా ‘మన్ కీ బాత్’ విన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 95వ ఎపిసోడ్లో ప్రసంగిస్తూ వచ్చే ఏడాది భారతదేశం నిర్వహించనున్న G20 సమ్మిట్లో స్వయంగా నేసిన లోగోను బహుమతిగా ఇచ్చిన తెలంగాణకు చెందిన ఒక నేత కార్మికుడిని ప్రశంసించారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హరిప్రసాద్ పేరుని ప్రస్తావిస్తూ ఆయన నైపుణ్యాలపై ఆయనకు పట్టు ఉందని, ఈ అద్భుతమైన బహుమతిని చూసి తాను ఆశ్చర్యపోయానని ప్రధాని అన్నారు.
“తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత వెల్ది హరిప్రసాద్ నాకు స్వయంగా నేసిన జి20 లోగోను పంపారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. అతను తన నైపుణ్యాలపై అంత పట్టును కలిగి ఉన్నాడు. అది అందరినీ ఆకర్షిస్తుంది. అతను నాకు లేఖ కూడా పంపాడు. వచ్చే ఏడాది జీ20 సమ్మిట్ను నిర్వహించడం భారత్కు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని అతను ఈ లోగోను తయారు చేశాడు. అతను ఈ ప్రతిభను తన తండ్రి నుండి వారసత్వంగా పొందాడు”అని మోదీ ప్రశంసించారు. G20 లోగోను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ను ప్రారంభించే ప్రత్యేకత తనకు ఉందని, పబ్లిక్ కాంటెస్ట్ ద్వారా లోగోను ఎంపిక చేశామని ప్రధాని చెప్పారు.
Began today’s #MannKiBaat programme by talking about a very special gift I received from a weaver in Telangana and how it is an example of keen interest towards India’s G20 Presidency. pic.twitter.com/NSKgGroS9s
— Narendra Modi (@narendramodi) November 27, 2022
శాంతి లేదా ఐక్యత, పర్యావరణం పట్ల సున్నితత్వం లేదా సుస్థిర అభివృద్ధి వంటి సవాళ్లకు పరిష్కారాలు ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. మేము ఇచ్చిన (G-20 కోసం) ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే థీమ్ వసుధైవ కుటుంబానికి మన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. డ్రోన్ల రంగంలో భారత్ కూడా వేగంగా దూసుకుపోతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం ‘మన్కీ బాత్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మోదీ తరచుగా గత నెలలో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ రాబోయే చారిత్రక సంఘటనలను చర్చిస్తారు.
Tags
Related News
CM Revanth Reddy : సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డిని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సివిల్స్ థర్ట్ ర్యాంకర్(Civils third ranker)అనన్యరెడ్డి(Ananya Reddy) కలిశారు. అనంతరం ఆయన ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. We’re now on WhatsApp. Click to Join. అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థినికి వరుసగా రెండోసారి మూడో ర్యాంకు వ