HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pakistan Blames India For Floods In Pakistan Occupied Kashmir

POK Floods : పాక్ ఆక్రమిత కశ్మీరులో వరదలు.. భారత్ పనే అంటున్న పాక్

భారత్‌లోని అనంతనాగ్ నుంచి చకోఠీ ప్రాంతం మీదుగా నీరు పీఓకేలోకి(POK Floods) ప్రవేశిస్తున్నట్టు చెబుతోంది.

  • Author : Pasha Date : 27-04-2025 - 10:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pok Floods Pakistan Occupied Kashmir Jhelum River pakistan India

POK Floods : పాకిస్తాన్ వక్రబుద్ధి మారడం లేదు. భారత్‌ను తప్పుడు కోణంలో చూసే పనిని పాక్ ఆపడం లేదు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)ను వరదలు ముంచెత్తుతున్నాయి. చివరకు ఈ వరదలను కూడా భారత్‌తో ముడిపెట్టి పాకిస్తాన్ చూస్తోంది.

Also Read :ED Office Fire: ఈడీ ఆఫీసు భవనంలో భారీ అగ్నిప్రమాదం

అకస్మాత్తుగా జీలం నీటిని వదిలిందని.. 

ఓ వైపు భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీరులో జీలం నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో పీఓకేలోని ముజఫరాబాద్‌కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. జీలం నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు అలర్ట్‌గా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. పీఓకేలోని హట్టియన్ బాలా, ఘరి దుపట్టా, మఝోయ్ వంటి ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. జీలం నది నీటిమట్టం పెరగడంతో చకోఠి సరిహద్దు నుంచి ముజఫరాబాద్ వరకు నదీతీరంలో వరదల ముప్పుపెరిగింది. దీంతో అక్కడి ప్రజలను ఆందోళన చుట్టుముట్టింది. భారత్ ఉద్దేశపూర్వకంగానే అకస్మాత్తుగా జీలం నది నీటిని పీఓకేలోకి వదిలిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.

Also Read :Pakistan: పాక్ బుద్ధి మార‌దు.. మ‌రోసారి భార‌త సైన్యంపై కాల్పులు!

ఇరుదేశాల మధ్య కమ్యూనికేషన్ లేక.. 

భారత్‌లోని అనంతనాగ్ నుంచి చకోఠీ ప్రాంతం మీదుగా నీరు పీఓకేలోకి(POK Floods) ప్రవేశిస్తున్నట్టు చెబుతోంది. ప్రస్తుతం పీఓకేలోని నదీ తీర ప్రాంతాల్లో 20 నుంచి 30 అడుగుల ఎత్తున జీలం నది నీళ్లు ప్రవహిస్తున్నాయని సమాచారం.  1990 దశకం తర్వాత పీఓకేలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. సింధూ నదీ ఒప్పందాన్ని నిలిపివేస్తామని భారత్ నిర్ణయించిన తర్వాత పీఓకేను వరదలు చుట్టుముట్టడం గమనార్హం. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలపై భారత అధికారులు ఇంకా స్పందించలేదు.  ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రతీ విషయంలో ఇరుదేశాలు అనుమాన భావంతో ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India vs Pakistan
  • Jhelum river
  • pakistan
  • Pakistan occupied Kashmir
  • POK Floods

Related News

Adiala Jail

పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • LPG Price

    LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందో తెలుసా?!

  • President Trump

    President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

  • ICC Promotions

    ICC Promotions: టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు మరో అవమానం!

  • Benz Cars Price Hike

    Benz Cars Price Hike : భారీగా పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

Latest News

  • తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

  • ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

  • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd