Pakistan: పాక్ బుద్ధి మారదు.. మరోసారి భారత సైన్యంపై కాల్పులు!
పాకిస్తాన్ సైన్యం జమ్మూ-కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద తుత్మారి గల్లి, రాంపూర్ సెక్టార్ల ముందు ఉన్న భారతీయ చౌకీలపై తాజాగా కాల్పులు జరిపింది. భారత సైన్యం కూడా ఈ కాల్పులకు ప్రతిస్పందనగా సమాధానం ఇచ్చింది.
- By Gopichand Published Date - 09:33 AM, Sun - 27 April 25

Pakistan: పాకిస్తాన్ సైన్యం (Pakistan) జమ్మూ-కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (LoC) వద్ద తుత్మారి గల్లి, రాంపూర్ సెక్టార్ల ముందు ఉన్న భారతీయ చౌకీలపై తాజాగా కాల్పులు జరిపింది. భారత సైన్యం కూడా ఈ కాల్పులకు ప్రతిస్పందనగా సమాధానం ఇచ్చింది. భారత సైన్యం ప్రకారం.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులను బాధ్యులుగా భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఆ ప్రమేయాన్ని ఖండించింది. స్వతంత్ర విచారణను డిమాండ్ చేసింది. ఈ దాడి తర్వాత నుండి భారత్ పాకిస్తాన్పై అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంది.
భారత సైన్యం నిరంతరం చర్యల్లో
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత నుండి భారత సైన్యం నిరంతరం చర్యల్లో ఉంది. శోధన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం కుల్గామ్ జిల్లాలోని తంగ్మార్గ్ ప్రాంతంలో కూడా భద్రతా బలగాలు ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాయి. అయితే, ఉగ్రవాదులు పారిపోవడంలో విజయవంతమయ్యారు.
Also Read: Pahalgam Terror Attack : కశ్మీర్ ఇండియాదే… అక్కడున్న కశ్మీరీలు మనోళ్లే – విజయ్ దేవరకొండ
కాశ్మీర్లో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై పెద్ద ఎత్తున చర్య
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత అధికారులు కాశ్మీర్లో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేయడం, వారి స్థావరాలపై దాడులు చేయడం, వందలాది ఉగ్రవాద సహాయకులను విచారణ కోసం అదుపులోకి తీసుకోవడం వంటివి ఉన్నాయి.
న్యూస్ ఏజెన్సీ పీటీఐకి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 9 మంది ఉగ్రవాదులు లేదా వారి సహాయకుల ఇళ్లను ధ్వంసం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న ఇతర వ్యక్తులపై కూడా ఇలాంటి చర్యలు తీసుకోబడతాయని వారు తెలిపారు. భద్రతా బలగాలు లోయలో ఉన్న గుర్తించబడిన ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల కోసం శోధిస్తున్నాయని, పహల్గామ్ వంటి దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు.