HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pakistan Army Crosses The Line Of Control And Fires At Posts India Retaliates

Pak Vs India : నియంత్రణ రేఖను దాటొచ్చిన పాక్‌ ఆర్మీ.. ఏమైందంటే..

ఈవిధంగా చొరబాటుకు పాల్పడటం ద్వారా పాక్ సైన్యం(Pak Vs India) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.

  • By Pasha Published Date - 11:54 AM, Wed - 2 April 25
  • daily-hunt
Pakistan Army Indian Army Pak Vs India Line Of Control Loc Indian Army Posts Min

Pak Vs India : భారత్‌-పాక్ సరిహద్దు‌ల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్‌‌లో ఉన్న నియంత్రణ రేఖ (LOC) వద్ద నుంచి పాక్‌ ఆర్మీ చొరబాటుకు తెగబడింది. దీంతో అక్కడ మందుపాతర పేలింది. ఆ వెంటనే పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది.  దీనికి భారత ఆర్మీ దీటుగా బదులిచ్చింది.  భారత దళాలు జరిపిన ప్రతీకార కాల్పుల్లో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించారని తెలుస్తోంది. చనిపోయిన పాక్ సైనికులను  చారికోట్ హవేలి నివాసి చౌదరి నజాకత్ అలీ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నాక్యాల్ కోట్లికి చెందిన నసీర్ అహ్మద్‌గా గుర్తించారు. ఈ ఘటన ఏప్రిల్ 1న మధ్యాహ్నం 1.30 గంటలకు చోటుచేసుకుంది. ప్రాణనష్టం, గాయపడిన వారి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఈవిధంగా చొరబాటుకు పాల్పడటం ద్వారా పాక్ సైన్యం(Pak Vs India) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జమ్మూకు చెందిన రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బార్త్వాల్ బుధవారం తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి శాంతి కోసం 2021లో భారత్, పాక్ సైన్యాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) మధ్య  ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు.

Also Read :Vijayasai Reddy : వచ్చే వారమే బీజేపీలోకి విజయసాయి రెడ్డి ? కారణం అదేనా ?

కథువాలో ఉగ్రవాదుల ఏరివేత

జమ్మూకశ్మీరులోని కథువాలో భారత సైన్యం ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం చొరబాటుకు యత్నించినట్లు తెలుస్తోంది. కథువాలో భారత భద్రతా దళాలు ఇప్పటివరకు ఇద్దరు పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులను హతమార్చింది. సరిహద్దు జిల్లాలోని పంజ్‌తిర్తి ప్రాంతంలో దాక్కున్న మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈ ఏడాది జనవరి నుంచే.. 

వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచే ఎల్‌ఓసీ వద్ద శాంతిని భగ్నం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. మార్చి 12న రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లోని కల్సియన్ ప్రాంతంలో ఎల్‌ఓసీపై పాకిస్తాన్ జవాన్ కాల్పుల్లో ఒక భారత సైనికుడు గాయపడ్డాడు. ఫిబ్రవరి 11న జమ్మూ ప్రాంతంలోని అఖ్నూర్ సెక్టార్‌లో ఉగ్రవాదులు జరిపిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) దాడిలో కెప్టెన్ కరమ్‌జిత్ సింగ్ బక్షి సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారు. ఫిబ్రవరి 10, 14 తేదీలలో రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఎల్‌ఓసీ వెంబడి జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనలలో ఇద్దరు సైనిక సిబ్బంది గాయపడ్డారు.  ఫిబ్రవరి మొదటి వారంలో పూంచ్‌లో జరిగిన వేర్వేరు ల్యాండ్‌మైన్ పేలుళ్లలో మరో ఇద్దరు సైనిక సిబ్బంది గాయపడ్డారు.

Also Read :Cyber Crimes: ఏపీలో ‘సైబర్’ టెర్రర్.. 8 నెలల్లో రూ.600 కోట్లు లూటీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Indian army
  • Indian Posts
  • Line of Control
  • LoC
  • PAK vs India
  • pakistan
  • Pakistan Army

Related News

Afghanistan-Pakistan War

Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

పాకిస్తాన్ వైమానిక దాడిలో మొత్తం 8 మంది మరణించారు. ఇందులో ఐదుగురు సాధారణ పౌరులు ఉన్నారు. అంతేకాకుండా 7 మంది ఇతర వ్యక్తులు కూడా గాయపడ్డారు.

  • Ex Soldier India

    Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

  • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

  • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd