HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Nehru Thought It Would Irritate Muslims Pm Modi

PM Modi: జవహర్‌లాల్ నెహ్రూపై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఒకప్పుడు బెంగాల్ మేధో శక్తి మొత్తం దేశానికి మార్గనిర్దేశం, ప్రేరణ ఇచ్చేది. బెంగాల్ శక్తియే భారతదేశ శక్తికి కేంద్ర బిందువు అని ఆంగ్లేయులు అర్థం చేసుకున్నారు. అందుకే వారు మొదట బెంగాల్‌ను విభజించడానికి ప్రయత్నించారు.

  • Author : Gopichand Date : 08-12-2025 - 6:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi
PM Modi

PM Modi: లోక్‌సభలో వందే మాతరంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జాతీయ గీతం పట్ల మహమ్మద్ అలీ జిన్నా ఆలోచనకు మద్దతు ఇచ్చారని ఆయన మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ఆరోపించారు. చర్చను ప్రారంభిస్తూ పీఎం మోదీ మాట్లాడుతూ..వందే మాతరం ముస్లింలను రెచ్చగొట్టే అవకాశం ఉందని నెహ్రూ ఒకసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు లేఖ రాశారని, దాని వినియోగాన్ని పరిశీలించాలని సూచించారని అన్నారు.

‘నెహ్రూ తన సింహాసనం కదులుతున్నట్లు కనిపించింది’

పీఎం మోదీ మాట్లాడుతూ.. వందే మాతరం పట్ల ముస్లిం లీగ్ వ్యతిరేక రాజకీయాలు తీవ్రమవుతున్నాయి. మహమ్మద్ అలీ జిన్నా అక్టోబర్ 15, 1937న లక్నో నుండి వందే మాతరంకు వ్యతిరేకంగా నినాదం ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూకు తన సింహాసనం కదులుతున్నట్లు కనిపించింది. జవహర్‌లాల్ నెహ్రూ ముస్లిం లీగ్ నిరాధారమైన ప్రకటనలకు గట్టి సమాధానం ఇవ్వడానికి, ఖండించడానికి బదులుగా, వందే మాతరంపై విచారణ ప్రారంభించారని తెలిపారు.

Also Read: CM Revanth Reddy: 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

సుభాష్ చంద్రబోస్‌కు రాసిన లేఖను పీఎం ప్రస్తావించారు

ప్రధానమంత్రి మాట్లాడుతూ.. జిన్నా వ్యతిరేకత తెలిపిన 5 రోజుల తర్వాత అక్టోబర్ 20న జవహర్‌లాల్ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు లేఖ రాశారు. జిన్నా భావనతో ఏకీభవిస్తూ వందే మాతరం ‘ఆనందమఠ్’ నేపథ్యం ముస్లింలను రెచ్చగొట్టవచ్చు అని రాశారు. దీని తర్వాత అక్టోబర్ 26 న కోల్‌కతాలో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరుగుతుందని, అందులో వందే మాతరం వినియోగాన్ని సమీక్షిస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని తెలిపారు.

‘వందే మాతరంపై కాంగ్రెస్ రాజీ పడింది’

ఈ తీర్మానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రభాత్ ఫేరీలను నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు అక్టోబర్ 26న కాంగ్రెస్ వందే మాతరంపై రాజీ పడింది. వందే మాతరాన్ని ముక్కలు చేసింది. ఆ నిర్ణయం వెనుక ఇది సామాజిక సామరస్యం కోసం అని ముసుగు వేశారు. కానీ చరిత్ర సాక్ష్యంగా కాంగ్రెస్ ముస్లిం లీగ్ ముందు మోకరిల్లింది. హిందుస్థాన్‌లో నివసించే ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకం ముందు తలవంచాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు.

ఒకప్పుడు బెంగాల్ మేధో శక్తి మొత్తం దేశానికి మార్గనిర్దేశం, ప్రేరణ ఇచ్చేది. బెంగాల్ శక్తియే భారతదేశ శక్తికి కేంద్ర బిందువు అని ఆంగ్లేయులు అర్థం చేసుకున్నారు. అందుకే వారు మొదట బెంగాల్‌ను విభజించడానికి ప్రయత్నించారు. బెంగాల్ విడిపోతే దేశం కూడా విడిపోతుందని వారు నమ్మారు. 1905లో ఆంగ్లేయులు బెంగాల్‌ను విభజించారు. కానీ వందే మాతరం ఒక శిలలా స్థిరంగా నిలిచింది. బెంగాల్ ఐక్యత కోసం వందే మాతరం ఒక ప్రతిధ్వనించే పిలుపుగా మారింది. అది వీధి వీధిలో మారుమోగింది అని పీఎం మోదీ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • national news
  • Nehru
  • pm modi
  • Trending news
  • Vande Mataram Debate

Related News

Markapuram Road accident pm modi

Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Harish Rana

    కోమాలో 13 ఏళ్లు.. నేడు తుది శ్వాస విడిచిన హ‌రీష్ రాణా!

  • Trump- PM Modi

    యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ!

  • Harish Rao Kanchukota

    Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

Latest News

  • Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

  • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

  • Peddi Tickets : పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్

  • Andhra Pradesh Assembly And Lok Sabha Seats: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు..?

  • Tamil Nadu Election 2026 : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Trending News

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

    • పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

    • రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd