HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Mp Tejasvi Surya Lashes Out Over Ap Bifurcation

BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

  • Author : Vamsi Chowdary Korata Date : 16-04-2026 - 3:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BJP's Tejasvi Surya Slams congress party
BJP's Tejasvi Surya Slams congress party

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించే చట్టాన్ని 2034 నుంచి అమలు చేయాలని ఆమోదించిన సమయంలో పేర్కొన్నారు. అయితే, దీనిని ముందుకు జరిపి 2029 నుంచే అమలుచేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పెంపు, పునర్విభజనకు వీలుగా మూడు కీలక బిల్లులను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అనంతరం ఈ బిల్లులపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా విపక్షాల ఆరోపణలను అధికార బీజేపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును ఆయన పాకిస్థాన్ విభజనతో పోల్చారు. ఏపీ విభజనను బ్రిటిషర్ల కంటే దారుణంగా చేశారని ఆరోపించారు. విభజన సమయంలో తెలుగు ప్రజల భావోద్వేగాలు, ఆర్థిక వనరులను కాంగ్రెస్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆ పాపం ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడుతూనే ఉందని ఆయన విమర్శించారు. విభజన గాయాల నుంచి ఇప్పటికీ ఏపీ కోలుకోలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అన్యాయానికి కాంగ్రెసే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా డీలిమిటేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హైబ్రిడ్ విధానాన్ని తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ఆయనకు ఇలాంటి సలహా ఎవరు ఇచ్చారో తెలియడం లేదని, రేవంత్ వాదనలకు తెలంగాణ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల ఆదాయం ఏటా మారుతుందని, నియోజకవర్గాల పునర్విభజనకు జీఎస్డీపీని ముడిపెట్టడం మూర్ఖత్వం అవుతుందని అన్నారు.

రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒక ఓటు ఉంటుందని, ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలని అన్నారు. ‘ధనవంతులకు ఎక్కువ ఓట్లు, పేదలకు సున్నా ఓట్లు’ అనే తర్కం ప్రకారం ‘ముఖేష్ అంబానీకి లక్ష ఓట్లు, మనలాంటి వారికి ఒక్క ఓటు మాత్రమే’ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

పేద, ధనిక, కుల, మత తారతమ్యాలు లేకుండా భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్కరికి ఓటు అనే గొప్ప సూత్రాన్ని అందించిందని అన్నారు. దానిని మార్చాలని భావించడం అజ్ఞానమే అవుతుందని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లను కల్పించే ప్రక్రియను 2029 ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటుచేసి.. మూడు బిల్లులను లోక్‌సభలో గురువారం ప్రవేశపెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజన కోసం 131 రాజ్యాంగ సవరణ చేపట్టనుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 50 శాతం అంటే 815కు పెంచనున్నారు. ఈ పెంపుతో మహిళలకు 272 సీట్లు లభిస్తాయని కేంద్రం చెబుతోంది. అయితే, ఈ ప్రక్రియను 2011 జనాభా లెక్కల ప్రకారం చేపట్టడం పట్ల విపక్షాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రారంభమైన జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతే ముందుకెళ్లాలని అంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Reorganization
  • BJP MP
  • BJP MP Tejasvi Surya
  • Chief Minister Revanth Reddy
  • congress party
  • parliament
  • tejaswi surya

Related News

A New Look for the Kaleswaram Temple

Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశే

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

    Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

Latest News

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

  • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

  • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

  • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd