Gas Leak: పంజాబ్లోని లూథియానాలో ఘోర ప్రమాదం.. గ్యాస్ లీక్ కావడంతో 9 మంది మృతి
పంజాబ్లోని లూథియానాలోని షేర్పూర్ చౌక్ సమీపంలోని సువా రోడ్లోని ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం గ్యాస్ లీక్ (Gas Leak) కావడంతో కనీసం 9 మంది మరణించారు.
- By Gopichand Published Date - 10:34 AM, Sun - 30 April 23
పంజాబ్లోని లూథియానాలోని షేర్పూర్ చౌక్ సమీపంలోని సువా రోడ్లోని ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం గ్యాస్ లీక్ (Gas Leak) కావడంతో కనీసం 9 మంది మరణించారు. పంజాబ్లోని లూథియానాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్పురా ప్రాంతంలో విషవాయువు లీక్ కావడంతో 9 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, పరిపాలన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సహాయంతో గాయపడిన వారిని అంబులెన్స్ నుండి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతమంతా సీల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#WATCH पंजाब: लुधियाना के ग्यासपुरा इलाके में गैस रिसाव की घटना सामने आई है। मौके पर NDRF की टीम पहुंच गई है और बचाव अभियान जारी है। pic.twitter.com/ILjXIO3KOY
— ANI_HindiNews (@AHindinews) April 30, 2023
లూథియానా వెస్ట్కు చెందిన SDM స్వాతి మాట్లాడుతూ.. ఖచ్చితంగా ఇది గ్యాస్ లీక్ కేసు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టనుంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, 11 మంది అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు, ఏడీసీపీ సమీర్ వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని, స్పృహతప్పి పడిపోయిన 5-6 మందిని ఆసుపత్రికి తరలించాం. ఈ ప్రాంతాన్ని సీల్ చేస్తున్నారు. సంఘటనా స్థలానికి NDRF బృందాన్ని రప్పించారు. అప్పటి నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని తెలిపారు.
Also Read: Godown Collapses: గోడౌన్ కూలి ఓ బాలిక సహా ముగ్గురు మృతి.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం
లూథియానాలోని గ్యాస్పురాలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా దృష్టి సారించారు. లూథియానాలోని గ్యాస్పురా ప్రాంతంలోని ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన చాలా బాధాకరమని సీఎం ట్వీట్ చేశారు. పోలీసులు, ప్రభుత్వ, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. అన్ని విధాలా సాయం చేస్తున్నారు అని పేర్కొన్నారు.
Related News
Amritpal Singh : ఎన్నికల బరిలో ఖలిస్థాన్ వేర్పాటువాది.. జైలు నుంచే పోటీ !
Amritpal Singh : అమృత్ పాల్ సింగ్.. మన దేశంలోని పంజాబ్ కేంద్రంగా ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కరుడుగట్టిన టెర్రరిస్ట్.