HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Kumbh Mela Mauni Amavasya Sacred Bath Arrangements

Maha Kumbh Mela 2025 : రేపు ఒక్క రోజే మహాకుంభ మేళాకు 10 కోట్ల మంది..!

Maha Kumbh Mela 2025 : జనవరి 29వ తేదీ బుధవారం మౌని అమావాస్య సందర్భంగా, త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ భక్తుల సౌకర్యం కోసం 60 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

  • By Kavya Krishna Published Date - 06:43 PM, Tue - 28 January 25
  • daily-hunt
Magh Purnima 2025
Magh Purnima 2025

Maha Kumbh Mela 2025 : మహాకుంభమేళ నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జనవరి 29వ తేదీ బుధవారం మౌని అమావాస్య సందర్భంగా, త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ భక్తుల సౌకర్యం కోసం 60 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ఇక మహాకుంభమేళ ప్రారంభమైన 17 రోజుల్లోనే 15 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌లో పవిత్ర స్నానం ఆచరించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా రైల్వే శాఖ , ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాయి. జనవరి 13, 14 తేదీల్లో కూడా భారీగా భక్తులు కుంభమేళలో పాల్గొన్నట్లు సమాచారం.

World Expensive Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇదే.. 250 గ్రాములకు 7500 రూపాయలు..!

రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు
రైల్వే శాఖ మొత్తం 60 ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు, భక్తుల రద్దీని అనుసరించి మరో 190 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంచింది. అలాగే, ఈ మార్గంలో 110 సాధారణ రైళ్లు యధావిధిగా నడుస్తాయని వెల్లడించింది. ప్రయాగ్ రాజ్ నుంచి ప్రతి 4 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. భద్రత కోసం 10 వేల మంది రైల్వే రిపబ్లికన్ ఫోర్స్ సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.

భద్రతా చర్యలు
మౌని అమావాస్య నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం త్రివేణి సంగమ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లను అమర్చింది. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానం ఆచరించినట్లు గణాంకాలు వెల్లడించాయి.

మౌని అమావాస్య ప్రత్యేకత
హిందూ క్యాలెండర్ ప్రకారం, మౌని అమావాస్యను అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా శారీరక, ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయని నమ్మకం. అఖాడాలు, సాధువులు, సన్యాసులు ప్రత్యేక ఊరేగింపుగా వచ్చి అమృత స్నానం ఆచరిస్తారు. మౌని అమావాస్యను సాధువుల అమావాస్యగా కూడా పిలుస్తారు.

ఈ పవిత్ర రోజున స్నానం చేస్తూ మౌనంగా ఉండడం సంప్రదాయం. నదుల నీరు అమృతంగా మారుతుందనే నమ్మకం భక్తులను ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో, యోగి ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించి కార్యక్రమాన్ని మరింత విశిష్టతతో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

Cold Water : మీ జీర్ణవ్యవస్థకు చల్లని నీరు ఎందుకు మంచిది కాదు..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hindu traditions
  • Indian Festivals
  • Kumbh Mela
  • Mauni Amavasya
  • Pilgrims
  • Railways
  • Sacred Bath
  • spirituality
  • Triveni Sangam
  • Uttar pradesh

Related News

Murder

Tragedy: చెల్లిని ప్రేమించాడని యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి..

Tragedy: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరాలు తగ్గడం లేదు. రోజురోజుకు నేరాల తీవ్రత పెరుగుతూ, ఘోర ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోరమైన హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.

    Latest News

    • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

    • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

    • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

    • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

    • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd