HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Kejriwal Claims That The Attacks Are Taking Place In The Wake Of The Gujarat Elections

Delhi CM Kejriwal : గుజరాత్ బీజేపీ కోటకు బీటలు…ఆ భయంతోనే ఈ దాడులు: కేజ్రీవాల్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల భయంతోనే ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  • By hashtagu Published Date - 08:23 AM, Sat - 27 August 22
  • daily-hunt
Arvind Kejriwal
Arvind Kejriwal (2)

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల భయంతోనే ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు ఇతర మంత్రుల ఇళ్లలో సోదాలని దీనికి కారణం అన్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆప్ ను ఏ ఒక్కరూ వీడిలేదని చెప్పేందుకు అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష నిర్వహిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.

గుజరాత్ లో బీజేపీకి గడ్డుకాలం:

గుజరాత్ లో బీజేపీకి గడ్డుకాలం ప్రారంభమైంది..కోటకు బీటలు పడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలోనే CBI, EDదాడులకు పాల్పడుతున్నారు. ఈ మధ్యే ఉపముఖ్యమంత్రి మనీశ్ సొసోడియా ఇంట్లో సీబీఐ నిర్వహించిన సోదాలో ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఢిల్లీ సర్కార్ ను కూలదోయాలన్నది బీజేపీ ప్రధాన లక్ష్యం. మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పటికే కూలగొట్టారు. బీజేపీ ప్రభుత్వాలను కూలదోయడంలో సీనియర్ కిల్లర్ అంటూ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు….బీజేపీ మాత్రం వాటిని కూలదోస్తుందంటూ నిప్పులు చెరిగారు.

277 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు:

277మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. దీనికి రూ. 5,500కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఢిల్లీలో ఆపరేషన్ చేపట్టేందుకు రూ. 800కోట్లు కేటాయించారని ఈ సందర్భంగా కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ మొత్తాన్నంతా కూడా జీఎస్టీ, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి సమకూర్చారని ఆరోపించారు. కాగా సోమవారం నాడు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP
  • bjp
  • delhi
  • gujarath
  • Kejriwal
  • Latest News
  • political update
  • politics

Related News

Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

Lokesh : మొత్తంగా, నాలుగు నెలల వ్యవధిలో లోకేశ్ రెండోసారి ప్రధాని మోదీని కలుసుకోవడం విశేషం. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ఏర్పడటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు

  • Nirmalabhatti

    Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

  • Yamuna River Levels

    Yamuna River Levels: ఢిల్లీలో హై అల‌ర్ట్‌.. 207 మీటర్ల మార్కు దాటిన య‌మునా న‌ది నీటిమ‌ట్టం!

  • Bjp

    BJP : ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని విందు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బల ప్రదర్శనకు స్కెచ్

  • Cbi Kcr

    CBI Enquiry on Kaleshwaram Project : కేసీఆర్ పై యాక్షన్ ..? బిజెపి భయపడుతోందా..? కారణం అదేనా..?

Latest News

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd