HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Internet Restoration In Manipur

Internet Restoration in Manipur : మణిపూర్ లో ఇంటర్నెట్ పునరుద్ధరణ

ఐదు నెలలుగా మణిపూర్ (Manipur) లోని మైతేయి, కుకీజాతుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం యుద్ధంగా మారి ప్రళయ బీభత్సాన్ని సృష్టించింది.

  • By Hashtag U Published Date - 05:48 PM, Sun - 24 September 23
  • daily-hunt
Internet Restoration In Manipur
Internet Restoration In Manipur

By: డా. ప్రసాదమూర్తి

Internet Restoration in Manipur : మణిపూర్ లో చెలరేగిన జాతుల విధ్వంసకాండ దేశాన్ని కుదిపేసింది. ఐదు నెలలుగా మణిపూర్ లోని మైతేయి, కుకీజాతుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం యుద్ధంగా మారి ప్రళయ బీభత్సాన్ని సృష్టించింది. ఈ హింసాకాండ, ఆగని ఈ విధ్వంసకాండ సెగ ఢిల్లీలోని పెద్దల గద్దెలకు కూడా తగిలింది. ప్రతిపక్షాలు మణిపూర్ (Manipur) అల్లర్లను అస్త్రంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన తీవ్రమైన దాడి కొనసాగించారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వానికి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అంతేకాదు ఈ ఐదు నెలల కాలంలో అనేక రకాల విధ్వంసం విలయతాండవం చేసింది. మైతేయి సముదాయం చేతిలో కుకీ జాతి ప్రజలు హత్యలకు గురయ్యారు. లక్షలాదిగా నిర్వాసితులయ్యారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో జరిగిన ఘటనలు దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా కుదిపేశాయి. అయితే మణిపూర్ (Manipur) హింసతో ఏలిన వారికి చీమకుట్టినట్టు కూడా కాలేదు. ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి అక్కడ ప్రజల్ని పరామర్శించలేదు. హోం మంత్రి అమిత్ షా వెళ్లినా మణిపూర్ మంటలు చల్లారిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడకు వెళ్ళినప్పుడు ఆయన్ని అడ్డుకున్నారు. అయినా సరే రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లి, మణిపూర్ మంటల్లో దగ్ధమైన జీవితాలను మోసుకుంటూ కృంగిపోతున్న వారిని పరామర్శించి వచ్చాడు. అందరిదీ ఒకటే మాట. మణిపూర్లో శాంతి భద్రతలు పునరుద్ధరించాలి. అంటే అక్కడి బిజెపి ప్రభుత్వం కొనసాగకూడదు. తక్షణం అక్కడున్న బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. ఈ విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. సరి కదా మణిపూర్లో ఏం జరుగుతుందో లోకానికి తెలియకుండా ఉండడం కోసం అక్కడ ఇంటర్నెట్ బ్యాన్ చేశారు. సెప్టెంబర్ 23 తేదీన ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు.

దాదాపు 5 నెలల పాటు మణిపూర్లో (Manipur) ఇంటర్నెట్ నిషేధం అమలులో ఉంది. అక్కడ ఏం జరుగుతుందో.. ఎవరు ఏ అమానుషత్వానికి, ఏ అరాచకానికి బలవుతున్నారో.. బయట ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ జాగ్రత్తల్లో ఇంటర్నెట్ బందు ఒకటి. మణిపూర్ లో జరుగుతున్నటువంటి విషయాన్ని వక్రీకరించి, బయట ప్రపంచానికి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడానికి ఇంటర్నెట్ ను కొందరు దుర్వినియోగం చేసుకుంటారని, అందుకే తాము ఇంటర్నెట్ ని బంద్ చేశామని ప్రభుత్వం చెబుతుంది.

ఉదాహరణకు కుకీ మహిళలు కొందరిని నగ్నంగా ఊరేగించి మైతేయి సముదాయం క్రూరంగా ప్రవర్తించిన ఘోర ఆటవిక చర్య బయట ప్రపంచానికి చాన్నాళ్లకు తెలిసింది. ఇది దేశాన్ని మొత్తం దావానలంలా చుట్టేసింది. ఈ ఘటన మే 4వ తేదీన జరిగితే జూలై మూడో వారంలో గాని సోషల్ మీడియాలో వెలుగు చూడలేదు. ఇది కేవలం ఒక ఘటన మాత్రమే ఇలాంటి వందలాది వేలాది ఘటనలు అక్కడ జరుగుతున్నాయి. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఆ వివరాలు బయటి వారికి తెలియడం లేదు. కాబట్టి మణిపూర్ (Manipur) లో ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు మణిపూర్ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎవరు ఏం గొడవ చేసినా, ఎంత అరిచి గీపెట్టినా కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ విషయంలో తొణకలేదు బెణక లేదు. ఇంటర్నెట్ నిషేధం సుదీర్ఘంగా మణిపూర్లో కొనసాగింది.

దేశంలో ఇంటర్నెట్ నిషేధం ఇంత దీర్ఘకాలం కొనసాగింది మణిపూర్లోనేనని చెబుతున్నారు. ఎట్టకేలకు ఐదు నెలలుగా మణిపూర్లో (Manipur) కొనసాగుతున్న ఇంటర్నెట్ సేవల నిషేధం ఎత్తివేస్తున్నట్టు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించడం ఆ రాష్ట్ర ప్రజలకే కాదు, దేశవ్యాప్తంగా సత్యాన్వేషకులకు కొంత ఊరట కలిగించింది. కేవలం మణిపూర్ లోనే కాదు ఎక్కడ అల్లర్లు చెలరేగినా విధ్వంసాలు పెచ్చరిల్లినా, ప్రభుత్వం తీసుకునే మొదటి చర్య ఇంటర్నెట్ నిషేధం. ఇది ఇలా చేయడం ప్రభుత్వానికి సులువైన పనే. ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ విలువలు పతనమైపోయి, ప్రజలు అలకల్లోలానికి గురైనప్పుడు, ఆ వార్తలు ప్రపంచానికి తెలియకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. అసలు అలాంటి ఘటనలు జరగకుండా, ఆ ఘటనల వెనుకున్న శక్తులను నియంత్రించి నిషేధించే నిజాయితీని, శక్తియుక్తుల్ని ప్రభుత్వం ప్రదర్శించాలి. మణిపూర్లో చెలరేగిన, ఇంకా కొనసాగుతున్న మారణకాండకు మానవీయ పరిష్కారం కనుగొనడమే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం. ఇంటర్నెట్ పునరుద్ధరించినట్టే ఆ మార్గంలో పయనించి తమ పట్ల ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని కూడా పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉంది.

Also Read:  AP : ముగిసిన చంద్రబాబు కస్టడీ విచారణ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • india
  • internet
  • manipur
  • politics
  • Restoration

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Bhatti Vikramarka

    Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

  • Ex Soldier India

    Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

  • Folk Singer Maithili Thakur

    Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

  • Jubilee Hills Bypoll Exit P

    Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

Latest News

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd