AP : ముగిసిన చంద్రబాబు కస్టడీ విచారణ
నిన్న, ఈరోజు చంద్రబాబు ను విచారించడం జరిగింది. రెండో రోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది
- By Sudheer Published Date - 06:07 PM, Sun - 24 September 23
స్కిల్ డెవలప్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ను CID అధికారులు రెండు రోజుల కస్టడీ లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న, ఈరోజు చంద్రబాబు ను విచారించడం జరిగింది. రెండో రోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చంద్రబాబు నుంచి అధికారులు స్కీల్ స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 30 అంశాలపై 120 వరకు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారులు చంద్రబాబును ప్రశ్నించారు. మొత్తంగా రెండు రోజుల్లో 12 గంటలపాటు అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ పై ప్రశ్నించారు.
కాసేపట్లో చంద్రబాబు వర్చువల్ విధానంలో జడ్జి ముందు హాజరు కాబోతున్నారు. అలాగే మరో రెండు రోజులు చంద్రబాబును కస్టడీ విచారణకు ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరనున్నారు. మరోపక్క రిమాండ్ ను కూడా పొడిగించాలని రిక్వెస్ట్ చేయనున్నారు. కస్టడీలో బాబును అడిగిన ప్రశ్నలు, ఆయన చెప్పిన సమాధానాలను అధికారులు న్యాయమూర్తికి సమర్పించనున్నారు. సీఐడీ కస్టడీలో భాగంగా అధికారులు చంద్రబాబును.. ప్రాజెక్టు విలువను ఎలా నిర్ణయించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు. జీవోకి విరుద్ధంగా ఒప్పందం ఎలా చేశారు. 13 చోట్ల నోట్ ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు లాంటి పలు అంశాలపై ప్రశ్నించారు.
Read Also : Somali Army: 27 మంది ఉగ్రవాదులను హతమార్చిన సోమాలియా నేషనల్ ఆర్మీ..!
Related News
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.