HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Targets Pakistan Occupied Kashmir Pakistan Army On High Alert

Target PoK : పీఓకే‌పైనే భారత్ గురి.. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లే లక్ష్యం

పీఓకేలోని(Target PoK) అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను పాక్ ఆర్మీ ఖాళీ చేయించినట్లు సమాచారం.

  • By Pasha Published Date - 01:03 PM, Tue - 29 April 25
  • daily-hunt
Pok India Pakistan Occupied Kashmir Pakistan Army Target Pok

Target PoK : జమ్మూకశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత సైన్యం పూర్తి ఫోకస్‌ను పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం.  ప్రత్యేకించి పీఓకేలోని కర్నా, కేరన్, మాచిల్ సెక్టార్లలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే  ఆయా సెక్టార్లకు సమీపంలోని ప్రాంతాలకు వెళ్లొద్దని జమ్మూకశ్మీరు ప్రజలకు భారత సైన్యం అడ్వైజరీ జారీ చేసిందని అంటున్నారు. పీఓకేపై ఆపరేషన్  చేపట్టనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కశ్మీర్‌వ్యాప్తంగా ఉన్న 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను భారత సర్కారు మూసివేయించింది. కశ్మీర్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్ దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులను మోహరించారు.

Also Read :WhatsApp Update : యాప్‌తో పనిలేదు.. ఇక వాట్సాప్ వెబ్‌ నుంచీ కాల్స్‌

పీఓకేలోని ఉగ్ర లాంచ్‌ప్యాడ్‌లే టార్గెట్ 

మరోవైపు పాకిస్తాన్ కూడా ఈవిషయాన్ని ఇప్పటికే పసిగట్టింది. పీఓకేలోని(Target PoK) అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను పాక్ ఆర్మీ ఖాళీ చేయించినట్లు సమాచారం. భారత సైన్యం దాడుల నుంచి కాపాడుకునేలా ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, భూగర్భ బంకర్లలోకి తరలించారని అంటున్నారు.  పీఓకేలోని కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లి, ఖుయిరట్టా, మంధర్, నికైల్, చమన్‌కోట్, జంకోట్ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను రహస్య ప్రదేశాలకు పాక్ ఆర్మీ పంపింది. పీఓకేలోని 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను భారత్ గుర్తించింది. వాటిలోనే పాక్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి, జమ్మూకశ్మీరులోకి పంపి ఉగ్రదాడులు చేయిస్తున్నారు.  భారత నిఘా  వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుతం పీఓకే సరిహద్దుల్లో దాదాపు 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే తైబా లాంటి ఉగ్రవాద సంస్థలు వీళ్లను పీఓకేలోకి పంపాయి. ఈ ఉగ్రమూకలను ఏరిపారేయడమే లక్ష్యంగా భారత్ ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టే అవకాశం ఉంది.

Also Read :Vanshika Saini : కెనడాలో ఆప్ నేత కుమార్తె దారుణ హత్య

భారత్ అమ్ములపొదిలో ఆధునిక ఆయుధాలు

2016లో పాక్ ఆక్రమిత కశ్మీరుపై సర్జికల్ స్ట్రైక్ చేసిన సమయంలో భారత్ వద్ద పాత తరం యుద్ధ విమానాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు భారత్ వద్ద 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని హర్యానాలోని అంబాలా,  పశ్చిమ బెంగాల్‌లోని హాషిమారా వైమానిక స్థావరాల్లో మోహరించారు. ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి.  వీటిని పాకిస్తాన్, చైనా బార్డర్‌లలో అందుబాటులో ఉంచారు. 2022 నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ అనే విమాన వాహక నౌకను భారత్ వినియోగిస్తోంది. ఇందులో ఎన్నో యుద్ధ విమానాలు, డ్రోన్లు, జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, డెస్ట్రాయర్లు, మిస్సైళ్లు ఉంటాయి.  పాకిస్తాన్‌లోని కరాచీ, గ్వాదర్ ఓడరేవులను చుట్టుముట్టేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ ఉపయోగపడుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • pakistan
  • Pakistan Army
  • Pakistan occupied Kashmir
  • POK
  • Target PoK

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Pakistan Bombs Its Own Peop

    Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి

  • Gen Z Protest Possible Ktr

    Gen Z Protest Possible In India : భారత్లోనూ జన్జ ఉద్యమం రావొచ్చు – కేటీఆర్

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd