HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Stops Indus Water Treaty Pakistan Response

Indus Water : సింధూ జలాలకోసం భారత్ కు పాక్ వరుస లేఖలు

Indus Water : భారత్ సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో తీవ్ర అయోమయంలో పడింది పాక్.

  • By Kavya Krishna Published Date - 06:58 PM, Fri - 6 June 25
  • daily-hunt
Indus Water
Indus Water

Indus Water : భారత్ సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో తీవ్ర అయోమయంలో పడింది పాక్. భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని పాకిస్థాన్ ఇప్పటివరకు నాలుగు లేఖలు భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపింది. ఇందులో మొదటి లేఖను మే నెల ప్రారంభంలో రాసినప్పటికీ, మిగతా మూడు లేఖలను “ఆపరేషన్ సింధూర్” తర్వాత పంపినట్లు పలు జాతీయ మీడియాలు వెల్లడించాయి.

పాకిస్థాన్ జల వనరుల శాఖ నుంచి భారతానికి ఈ లేఖలు వచ్చినట్లు అధికారిక సమాచారం ఉంది. అయితే, సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ లో తీవ్ర సంక్షోభం వచ్చే అవకాశం ఉందని పాక్ గతంలో ఓ లేఖలో స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో చర్చించడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని సమాచారం. ప్రోటోకాల్ ప్రకారం, ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా పంపినట్టు తెలుస్తోంది.

ఇందులో, వెనక్కు తగ్గేదేమీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. పాక్‌తో చర్చలు జరిగితే, అవి ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశాలపైకి మాత్రమే పరిమితం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారత్–పాక్ సంబంధాలు పూర్తిగా దిగజారిన నేపథ్యంలో, భారత ప్రభుత్వం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ నది మరియు దాని ఉపనదుల జలాలను పంచుకునే ఒప్పందం సంతకం చేయబడింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారత ప్రభుత్వం సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

CM Revanth Reddy : మీ ఫాం హౌస్‌లు లాక్కుంటామన్లే.. మూసీ ప్రక్షాళన చేస్తామనే అంటున్నాం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India Foreign Policy
  • India Pakistan Dispute
  • India-Pakistan
  • Indus Water Treaty
  • Jal Shakti Ministry
  • narendra modi
  • Operation Sindhur
  • Pahalgam Terror Attack
  • Pakistan Letters to India
  • Pakistan water crisis

Related News

    Latest News

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd