HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Her Body Her Right Delhi Hc Allows 22 Week Abortion

Abortion: మహిళకు అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు ఎందుకు అనుమతి ఇచ్చింది?

భారత చట్టంలో ఈ నిబంధన కొత్తది కాదు. 1970 లోనే ఈ నిబంధనను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 20 వారాల పిండాన్ని తొలగించడానికి అవకాశం ఉంది.

  • Author : Gopichand Date : 19-09-2025 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Abortion
Abortion

Abortion: ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా 30 ఏళ్ల మహిళకు 22 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతిని ఇచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లోనూ మహిళలకు ఇలాంటి అవకాశం లభించదు. అంతేకాకుండా భారత చట్టాల ప్రకారం.. 22 వారాల గర్భాన్ని తొలగించుకోవాలంటే (Abortion) కోర్టు అనుమతి అవసరం. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక కారణాలు లేకుండా మహిళకు గర్భస్రావానికి ఎందుకు అనుమతి ఇచ్చారో తెలుసుకుందాం.

ఈ తీర్పు ఏ కేసులో ఇచ్చారు?

ఢిల్లీ హైకోర్టులో ఒక 30 ఏళ్ల మహిళ కేసు విచారణలో ఉంది. ఆ మహిళ తన ప్రియుడితో లివ్-ఇన్-రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆ సమయంలో ఆమె రెండుసార్లు గర్భవతి అయింది. మొదటిసారి ఆమె భాగస్వామి నమ్మించి గర్భనిరోధక మాత్రలతో అబార్షన్ చేయించారు. కానీ రెండోసారి ఆమె గర్భవతి అయినప్పుడు చాలా వారాల గర్భం. అబార్షన్ చేసుకోవడానికి ఆమె మొదట నిరాకరించినప్పటికీ ఆమె భాగస్వామి బలవంతంగా మెడికల్ అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశారు.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు

భాగస్వామి మాట వినకపోవడంతో ఆమెపై దాడి చేసి వేధించారు. దీనిపై మహిళ ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రవీంద్ర దుదేజా స్పష్టం చేశారు. గర్భాన్ని కొనసాగించడం బాధితురాలి బాధలను మరింత పెంచుతుందని ఆయన అన్నారు. నిజానికి ఆ మహిళకు పెళ్లి చేసుకుంటానని అబద్ధపు వాగ్దానం చేశారు. ఇప్పుడు అది సాధ్యం కానందున గర్భాన్ని కొనసాగించడం ఆమెకు కష్టంగా ఉండవచ్చని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

Also Read: India vs Oman: నేడు భార‌త్- ఒమ‌న్ మ‌ధ్య మ్యాచ్‌.. ఆ ఆట‌గాడికి ఆరు సిక్సర్లు కొట్టే సత్తా ఉందా??

ఈ తీర్పు ఏ నేపథ్యంలో ఇచ్చారు?

మహిళకు మరింత కష్టం కలగకుండా సామాజిక అపవాదు నుంచి ఆమెను కాపాడటానికి న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారు. బాధితురాలికి ఇప్పటికే నిందితుడైన స్నేహితుడి వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి. కోర్టు కూడా ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోకపోతే ఆమెకు మరింత కష్టంగా ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. కోర్టు మహిళకు ఎయిమ్స్‌లో గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

ఈ చట్టం ఏమిటి, మహిళలకు ఇలాంటి హక్కులు ఎప్పుడు లభిస్తాయి?

భారత చట్టంలో ఈ నిబంధన కొత్తది కాదు. 1970 లోనే ఈ నిబంధనను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 20 వారాల పిండాన్ని తొలగించడానికి అవకాశం ఉంది. దీన్ని MTP చట్టం- 1971 అని అంటారు. ఇందులో చట్టపరమైన అబార్షన్ ప్రక్రియ గురించి వివరిస్తారు. ఈ చట్టాన్ని 2021లో మార్చారు. దాని ప్రకారం 24 వారాల వరకు గర్భస్రావం చేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే ఇది కూడా ప్రత్యేక పరిస్థితుల్లోనే సాధ్యం. చట్టం ప్రకారం.. వివాహిత, అవివాహిత మహిళల మధ్య ఇప్పుడు ఎలాంటి తేడా లేదు. ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయి. అత్యాచారం బాధితులు, మైనర్లు, వికలాంగ మహిళలకు 24 వారాల వరకు గర్భస్రావం చేసుకునే హక్కు కల్పించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • abortion
  • Delhi HC
  • national news
  • telugu news

Related News

Amrit Udyan

అమృత్ ఉద్యాన్ అంటే ఏమిటి? ప్రజల కోసం ఎప్పుడు తెరుస్తారు?

ఇక్కడికి వెళ్లడానికి మీరు కేంద్రీయ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలి. అక్కడ నుండి మీకు షటిల్ బస్సు సౌకర్యం సులభంగా లభిస్తుంది.

  • Padma Awards

    ప‌ద్మ అవార్డులు ప్ర‌క‌ట‌న‌.. వీరే విజేతలు!

  • Minister Uttam Kumar Reddy

    త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ‌కండి: మంత్రి ఉత్త‌మ్

  • Tobacco Products

    సిగ‌రెట్‌, పొగాకు ప‌దార్థాల‌పై నిషేధం విధించిన రాష్ట్ర ప్ర‌భుత్వం!

  • Republic Day 2026

    77వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు.. నేరస్తులను గుర్తించేందుకు స్మార్ట్ గ్లాసెస్?!

Latest News

  • పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!

  • 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ?

  • అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !

  • Parliament Budget Session 2026 : వికసిత్ భారత్ దిశగా అడుగులు – ముర్ము

  • జమ్మూ కాశ్మీర్ లో భారీ మంచు తుపాను

Trending News

    • అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన సంచలన నిజాలు

    • Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

    • దంప‌తుల మ‌ధ్య‌ గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?

    • ఆధార్ కొత్త యాప్ లాంచ్‌.. ఎప్పుడంటే?!

    • Rajasekhar Gotila Factory : నిజంగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందా ? ఈ ఫ్యాక్టరీ ని బయటకు తీసిందెవరు ? అసలు ఈ ప్రచారానికి మూలం ఎక్కడ పడింది ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd