Gautam Gambhir : రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్బై.. నెక్ట్స్ ఫోకస్ దానిపైనే
Gautam Gambhir : మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు.
- By Pasha Published Date - 11:00 AM, Sat - 2 March 24
Gautam Gambhir : మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి లోక్సభ ఎంపీగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరని తెలుస్తోంది. తనకెంతో ఇష్టమైన క్రికెట్పై మళ్లీ ఫోకస్ చేయాలని భావిస్తున్నందున రాజకీయాల నుంచి వైదొలగాలని గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నారు. ఇదేవిషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన తెలిపారు. ‘‘రాబోయే క్రికెట్ కమిట్మెంట్లపై దృష్టి పెట్టడానికిగానూ రాజకీయ బాధ్యతల నుంచి వైదొలిగేందుకు నాకు ఛాన్స్ ఇవ్వండని జేపీ నడ్డాజీని కోరాను. ఇన్నాళ్ల పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్’’ అని ట్విట్టర్ వేదికగా గంభీర్(Gautam Gambhir) ఓ పోస్ట్ చేశారు.
I have requested Hon’ble Party President @JPNadda ji to relieve me of my political duties so that I can focus on my upcoming cricket commitments. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Hon’ble HM @AmitShah ji for giving me the opportunity to serve the people. Jai Hind!
— Gautam Gambhir (@GautamGambhir) March 2, 2024
We’re now on WhatsApp. Click to Join
- గౌతమ్ గంభీర్ 2019 మార్చి 22న నాటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో బీజేపీలో చేరారు.
- అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీచేసిన గంభీర్ 6,95,109 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
- 2024 లోక్సభ ఎన్నికలలో గంభీర్కు తూర్పు ఢిల్లీ టిక్కెట్ దక్కకపోవచ్చే ప్రచారం జరుగుతోంది.
- గంభీర్ తన నియోజకవర్గంలో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేశాడు.
- COVID-19 మహమ్మారి సమయంలో గంభీర్ ఎంపీగా తన రెండేళ్ల జీతాన్ని విరాళంగా ఇచ్చాడు.
- గంభీర్ తన ఫౌండేషన్ ద్వారా తన నియోజకవర్గంలో COVID-19 టీకా శిబిరాలను నిర్వహించాడు.
- 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు, 2022 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గంభీర్ నియోజకవర్గంలో ఢిల్లీ బీజేపీ మంచి పనితీరును కనబర్చింది.
Also Read : Yuvraj Singh: రాజకీయాల్లోకి యువరాజ్ సింగ్..? క్లారిటీ ఇచ్చిన యువీ..!
గతంలో కోల్కత నైట్ రైడర్స్ టీమ్లో కెప్టెన్గా వ్యవహరించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మళ్లీ సొంతగూటికి చేరుకున్నాడు. కోల్కత నైట్ రైడర్స్ మెంటార్గా గతేడాది నవంబరు చివరి వారంలో అపాయింట్ అయ్యాడు. ఇదివరకు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్లో గంభీర్ పని చేశాడు. ఇప్పుడు ఆ జట్టుకు గుడ్ బై చెప్పి కోల్కత నైట్ రైడర్స్ టీమ్లోకి వచ్చేశాడు.హెడ్కోచ్ చంద్రకాంత్ పండిట్తో కలిసి టీమ్కి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. 2011-17 మధ్య కాలంలో గౌతమ్ గంభీర్ కోల్కత నైట్ రైడర్స్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించారు. 2012, 2014లో టైటిల్ కూడా గెలిచింది కోల్కతా టీమ్.
Related News
Robert Vadra : నేను పాలిటిక్స్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది : రాబర్ట్ వాద్రా
Robert Vadra : ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానం ఎవరికి ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.