Farmers’ Protest: మారో యాక్షన్ ప్లాన్ కి సిద్దమైన దేశంలోని రైతులు…?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
- By Hashtag U Published Date - 01:01 PM, Thu - 11 November 21
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు పలురకాలుగా నిర్వహించిన రైతులు ఈ సారి మరో యాక్షన్ ప్లాన్ కి సిద్దమైయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభంకానుడటంతో ఈ ఉద్యమాన్నిమరింత ఉదృతం చేయాలని రైతులు భావిస్తున్నారు. శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతి రోజూ పార్లమెంట్ కు రైతులు శాంతియుతంగా ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 29 నుండి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలలో ప్రతిరోజూ 500 మంది రైతులు శాంతియుతంగా పార్లమెంటుకు ట్రాక్టర్ మార్చ్లో పాల్గొంటారని కిసాన్ మోర్చా తెలిపింది. కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి నవంబర్ 26 నాటికి ఏడాది కావొస్తుంది.దీనికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కిసాన్ మోర్చా తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల నుండి రైతులు నవంబర్ 26, 2020 నుండి ఢిల్లీ సరిహద్దులలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి తమ బలాన్ని పెంచుకోవాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. టిక్రీ, ఘాజీపూర్ల నుండి ప్రతిరోజూ ఐదు వందల మంది రైతులు పార్లమెంటు కి వెళ్లి సెషన్ ముగిసే వరకు అక్కడే ఉంటారని కిసాన్ మోర్చా తెలిపింది.
Also Read : నోట్లో నుంచి బయటికొచ్చిన సాలీడు.. వైరల్ అవుతున్న వీడియో
శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత రైతులు పార్లమెంట్ వైపు కదులుతారని రైతు నాయకుడు దర్శన్ పాల్ అన్నారు. అయితే, ‘కిసాన్ సంసద్’కి అనుమతి ఉన్నప్పటికీ, రైతులకు మార్చ్ కి అనుమతి ఇవ్వడంలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ వారంలో రైతులు, ఢిల్లీ పోలీసుల మధ్య దీనిపై సమావేశం జరిగే అవకాశం ఉంది. కిసాన్ మోర్చా,40 రైతుల సంఘాలు ఈ ఆందోళనకు నాయకత్వం వహించనున్నాయి. సోనిపట్-కుండ్లీ సరిహద్దులో రైతు సంఘాలు సమావేశం నిర్వహించిన తర్వాత ట్రాక్టర్ మార్చ్ను ప్రకటించాయి. నవంబరు 26న…ఆ తర్వాత భారతదేశమంతటా భారీ ఉద్యమం ఒక సంవత్సరం పాటిస్తామని తెలిపింది.
నవంబర్ 29 నుండి ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు, 500 మంది ఎంపిక చేసిన రైతు వాలంటీర్లు ప్రతిరోజూ శాంతియుతంగా, పూర్తి క్రమశిక్షణతో ట్రాక్టర్ ర్యాలీలో పార్లమెంటుకు తరలివెళ్లాలని SKM నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రైతులు చారిత్రాత్మక పోరాటం చేసి తమ డిమాండ్లను అంగీకరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇది దోహదపడుతుందని కిసాన్ మోర్చా పేర్కొంది. అంతకుముందు మార్చిలో కూడా వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పార్లమెంట్ కు పాదయాత్ర చేపట్టారు. జనవరి 26న ఒక ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది, నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టడం, భద్రతా సిబ్బందిపై దాడి చేయడమే కాక… ఎర్రకోటపై దాడి చేసి…అక్కడ మతపరమైన జెండాను ఎగురవేశారు.
Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు
నవంబర్ 26న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీ జనసమీకరణ ఉంటుందని ఎస్కెఎం ప్రకటించింది. ఆ రోజు అక్కడ (సరిహద్దుల్లో) భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని… ఇప్పటి వరకు జరిగిన ఈ పోరాటంలో 650 మందికి పైగా అమరవీరులకు నివాళులర్పిస్తామని తెలిపింది. నవంబర్ 26న అన్ని రాష్ట్ర రాజధానుల్లో భారీ మహాపాదయాత్రలకు SKM పిలుపునిచ్చింది.
Related News
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించిన నల్లగొండ రైతులు
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించారు నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు. ఐకేపీ సెంటర్ కాంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేశారు రైతులు. ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడు నది ఎండాకాలం కుడా నీళ్లు మతల్లు దునికేవని, మీరు ఉన్నప్పుడే అప