HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Encounter In Chhattisgarh Three Maoists Killed

Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోలు మృతి

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్‌ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • By Latha Suma Published Date - 04:56 PM, Thu - 29 August 24
  • daily-hunt
Encounter
Encounter

Encounter: ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్‌లో భద్రతా బలగాలు-నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్‌ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం నుంచి ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని ఐజీ బస్తర్‌ పి. సుందర్‌రాజ్‌ తెలిపారు. ఇంకా కాల్పులు జరుగుతున్నాయని.. సైనికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, సేఫ్ గా ఉన్నట్లు ఆయన చెప్పారు.

కాగా, 2026 మార్చినాటికి నక్సల్‌ హింస నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ నెల 25న ప్రకటించిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ నక్సల్‌ ఆపరేషన్స్‌పై జరిగిన సమావేశం అనంతరం మాట్లాడుతూ.. వామపక్ష తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం వచ్చిందని చెప్పారు. మన దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థకు అతి పెద్ద సవాల్‌ నక్సలిజమని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సవాల్‌ను స్వీకరించిందని, ఆయుధాలు పట్టినవారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తేవడానికి ప్రయత్నించిందని చెప్పారు. నక్సలిజం వల్ల గత నాలుగు దశాబ్దాల్లో 17,000 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నక్సల్‌ నేతలను మట్టుబెట్టామని తెలిపారు.

Read Also: Mukesh Ambani : జామ్‌నగర్ ప్రపంచ ఇంధన రాజధానిగా మారనుంది

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abujhmad
  • chhattisgarh
  • encounter
  • maoists

Related News

    Latest News

    • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

    • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

    • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd