Guava Compensation Scam: పంజాబ్ లో జామ తోటల కుంభకోణం.. బయల్దేరిన ఈడీ
పంజాబ్ లో రూ.137 కోట్ల జామ తోటల నష్టపరిహారం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం పంజాబ్లోని ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
- Author : Praveen Aluthuru
Date : 27-03-2024 - 3:38 IST
Published By : Hashtagu Telugu Desk
Guava Compensation Scam: పంజాబ్ లో రూ.137 కోట్ల జామ తోటల నష్టపరిహారం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం పంజాబ్లోని ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ మొహాలి ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సేకరించిన భూమిలో జామ తోటలకు పరిహారంగా విడుదల చేసిన దాదాపు రూ. 137 కోట్ల అవినీతికి సంబంధించి పంజాబ్ విజిలెన్స్ బ్యూరో కేసును పరిగణనలోకి తీసుకుని ఈడీ కేసు నమోదు చేసింది.
చండీగఢ్లోని రాష్ట్ర ఎక్సైజ్ మరియు టాక్సేషన్ కమిషనర్ వరుణ్ రూజం నివాసంతో పాటు పాటియాలాలోని ఫిరోజ్పూర్ డిప్యూటీ కమిషనర్ రాజేష్ ధీమాన్ మరియు అతని చార్టర్డ్ అకౌంటెంట్ అనిల్ అరోరా నివాసంలో సోదాలు జరిగాయి. స్కామ్లో ప్రధాన నిందితుడు భూపిందర్ సింగ్ మొహాలీ జిల్లాలో నివాసం ఉంటున్న ఇంటిపై కూడా దాడులు జరిగాయి.
ఈ కేసులో ఉద్యానవన శాఖ అధికారులతో పాటు పలువురిని విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. ఈ కేసులో విజిలెన్స్ గతేడాది మే 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మొత్తం దాదాపు 30 మందిని అరెస్టు చేశారు. కుంభకోణానికి కేంద్రమైన మొహాలీ జిల్లాలో జామ చెట్ల పెంపకంతో కూడిన అక్రమ పరిహారం కుంభకోణానికి సంబంధించిన రికార్డులు మరియు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఈడీ కోరింది.
Also Read: Kia K4: కియా నుంచి మరో సూపర్ స్టైలిష్ కారు.. భారత్లో లాంచ్ ఎప్పుడంటే..?