HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Details Revealed Man In Gujarat Hospital Kills 2 Women

kills 2 women: ఆసుపత్రిలో తల్లీకూతుళ్లను హత్య చేసిన కాంపౌండర్

చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లీకూతుళ్లను ఓ కాంపౌండర్ హత్య (Murder) చేసిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. చంపావాలా అనే మహిళ తన కుమార్తె భారతితో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా మన్సుఖ్ అనే కాంపౌండర్ వారికి మత్తు మందు ఇచ్చి హత్య (Murder) చేశాడు.

  • By Gopichand Published Date - 07:33 AM, Sat - 24 December 22
  • daily-hunt
Murder
Murder

చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లీకూతుళ్లను ఓ కాంపౌండర్ హత్య (Murder) చేసిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. చంపావాలా అనే మహిళ తన కుమార్తె భారతితో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా మన్సుఖ్ అనే కాంపౌండర్ వారికి మత్తు మందు ఇచ్చి హత్య (Murder) చేశాడు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రిలో దాచి పెట్టాడు. సిబ్బంది మృతదేహాలను గుర్తించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఆస్పత్రిలో తల్లీ కూతుళ్ల మృతదేహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. తొలుత ఆపరేషన్ థియేటర్‌లోని వార్డ్‌రోబ్‌లో కూతురి మృతదేహం, ఆ తర్వాత మంచం కింద తల్లి మృతదేహం లభ్యమైంది. ఈ ఆసుపత్రి అహ్మదాబాద్‌లోని కాగ్డాపీఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూలాభాయ్ పార్క్ సమీపంలో ఉంది. ఈ విషయానికి సంబంధించి ఏసీపీ మిలాప్ పటేల్ మాట్లాడుతూ.. తల్లీకూతురు చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారని, ప్రస్తుతం ఇద్దరి మృతదేహాలను ఈ ఆస్పత్రి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వార్డ్‌రోబ్‌లో కూతురి డెడ్ బాడీ మొదట కనిపించింది. ఈ కేసులో తల్లిని విచారించేందుకు పోలీసులు వెతకగా మంచం కింద నుంచి మరో మృతదేహం బయటపడింది. అది ఆమె తల్లిది.

Also Read: 5 Cops Among 17 Arrested: పాక్ నుంచి కాశ్మీర్‌కు డ్రగ్స్.. ఐదుగురు పోలీసులతో సహా 17 మంది అరెస్ట్

దీనికి సంబంధించి ఆస్పత్రిలో పనిచేస్తున్న మన్‌సుఖ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందిన సమాచారం ప్రకారం.. అహ్మదాబాద్‌లోని కాగ్డాపీఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూలాభాయ్ పార్క్ సమీపంలో ఉన్న ఆసుపత్రి లోపల నుండి దుర్వాసన వెదజల్లుతున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. విచారణలో ఇద్దరు మహిళలు హత్యకు గురైనట్లు తేలింది. కుమార్తె వయస్సు 30 సంవత్సరాలు, ఆమె మృతదేహం ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఉంచిన అల్మారాలో కనుగొనబడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో మృతదేహాలు ఇలా బయటకిరావడంతో ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ విషయమై ఆసుపత్రి సిబ్బందిని కూడా నిత్యం ప్రశ్నిస్తున్నారు.

చెవి నొప్పితో బాధపడుతున్న చంపావాలా, ఆమె కుమార్తె భారతిని బుధవారం ఉదయం 9.30కు వైద్యుడు లేని సమయంలో చికిత్స కోసమని చెప్పి మన్సుఖ్‌ రప్పించాడు. తొలుత భారతికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి గొంతు నులిమి చంపాడు. అనంతరం చంపాను కూడా అదే రీతిలో అంతమొందించాడు. వారు ఆసుపత్రికి వచ్చిన తర్వాత మన్సుఖ్‌ గంట పాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా ఆఫ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime news
  • Gujarat Crime News
  • Gujarat Police
  • gujarath
  • killed 2 women
  • Murder News

Related News

Bomb Threat

Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

Bomb Threat : దేశ ఆర్థిక రాజధాని ముంబయి మరోసారి ఉగ్ర బెదిరింపులతో కాసేపు ఉలిక్కిపడింది. నగరంలో భారీ ఉగ్రదాడులు జరగనున్నాయంటూ శుక్రవారం ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ఒక ఇమెయిల్‌ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

  • Murder

    Tragedy: చెల్లిని ప్రేమించాడని యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి..

Latest News

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd