ATM Thefts : ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దోపిడీ దొంగలు అరెస్ట్
ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్, మధ్యప్రదేశ్లలో ఐదు
- By Prasad Published Date - 10:09 PM, Sat - 21 January 23
ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్, మధ్యప్రదేశ్లలో ఐదు ఏటీఎంలలో చొరబడి రూ.87 లక్షల నగదుతో పారిపోయిన అంతర్రాష్ట్ర ముఠాను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఛేదించింది, ఫరీదాబాద్లోని సూరజ్కుండ్ రోడ్డులో కొద్దిసేపు కాల్పులు జరిపిన తర్వాత ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో పెరుగుతున్న ఏటీఎం దొంగతనాల దృష్ట్యా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిఘా పెట్టింది. ఈ బృందం అనుమానితులను గుర్తించింది. ముఠాలోని ఇద్దరు సభ్యులు సూరజ్కుండ్ రోడ్లోని స్పోర్ట్స్ గ్రౌండ్ దగ్గరికి ఎకో కారులో వస్తున్నారని నిఘా విభాగానికి సమచారం అందింది.
ఏసీపీ అత్తర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అనుమానాస్పద వ్యక్తులు కారులో నుంచి బయటకు రాగా, వారిలో ఒకరు తన వద్ద ఉన్న పిస్టల్ తీసి పోలీసు బృందంపై కాల్పులు జరిపారు. పోలీసు బృందంలోని ఒక సిబ్బంది కూడా ఆత్మరక్షణ కోసం ఒక రౌండ్ కాల్పులు జరిపారు. పోలీసు బృందం అనుమానితులను మట్టుబెట్టి వారిని నిరాయుధులను చేసింది. నిందితులను హర్యానాలోని నుహ్లో నివాసముంటున్న షోహ్రాబ్ అకా సబ్బా, సమీర్ ఖాన్లుగా గుర్తించారు. షోహ్రాబ్ నుండి మూడు లైవ్ కాట్రిడ్జ్లతో కూడిన సెమీ ఆటోమేటిక్ పిస్టల్ మరియు సమీర్ ఖాన్ నుండి రెండు లైవ్ కాట్రిడ్జ్లతో కూడిన సింగిల్ షాట్ పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై ఐపీసీ, ఆయుధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు
Tags
Related News
Five Burnt Alive : ఐదుగురు సజీవ దహనం.. ప్రైవేట్ ట్రావెల్స్ను ఢీకొన్న టిప్పర్
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.