BJP : ఢిల్లీ పీఠం కోసం.. బీజేపీ పకడ్బందీ వ్యూహా రచన..!
BJP : ఇప్పటివరకు రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ, ఈసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది.
- By Kavya Krishna Published Date - 06:08 PM, Thu - 9 January 25

BJP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఈ ఎన్నికల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి ముగింపు పలకాలని బీజేపీ తమ వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ దిశగా గురువారం సాయంత్రం 4 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఢిల్లీ ఎన్నికలపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్తో పాటు పార్టీ ప్రధాన నేతలు పాల్గొన్నారు. ఇప్పటివరకు రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ, ఈసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి ఆప్ అధికారం పొందినట్టుగా, ఇప్పుడు ఆప్ నుంచి అధికారాన్ని బీజేపీకి మార్చాలని వ్యూహాలు రచిస్తోంది.
Steve Smith: కమిన్స్కు రెస్ట్.. అతని స్థానంలో బాధ్యతలు చేపట్టిన స్టీవ్ స్మిత్!
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిఘటన
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ అవడం, అరవింద్ కేజ్రీవాల్పై ఆరోపణలు వచ్చినా, ఆప్ అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్ తన నిర్దోషిత్వాన్ని ఎన్నికల గెలుపు ద్వారా నిరూపించుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీకి సంబంధించిన ఏడు సీట్లను బీజేపీ గెలుచుకుంది. అదే విజయాన్ని అసెంబ్లీ స్థాయిలో కూడా నిలబెట్టాలని పార్టీ వ్యూహాత్మక కార్యక్రమాలు చేపట్టింది. ప్రచారానికి దేశవ్యాప్తంగా నాయకులను రంగంలోకి దింపి, బలమైన ప్రచార వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీన ఒకే విడతలో నిర్వహించబడతాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడతాయి. ఢిల్లీ ఓటర్ల తుది తీర్పు ఏ పార్టీకి పట్టం కడుతుందనేది ఆసక్తిగా మారింది.
CM Revanth Reddy : రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి