HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Countrys Democracy In Danger Conspiracy Being Hatched To Change Constitution Sonia Gandhi

Democracy in Danger: రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది: సోనియా గాంధీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని, వివక్ష, దౌర్జన్యాలను మాత్రమే ప్రచారం చేసిందని అన్నారు. ప్రతిచోటా అన్యాయమే జరిగిందని దుయ్యబట్టారు.

  • By Praveen Aluthuru Published Date - 03:35 PM, Sat - 6 April 24
  • daily-hunt
Sonia Gandhi
Sonia Gandhi

Democracy in Danger: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని, వివక్ష, దౌర్జన్యాలను మాత్రమే ప్రచారం చేసిందని అన్నారు. ప్రతిచోటా అన్యాయమే జరిగిందని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో చీకట్లు అలుముకుంటున్నాయని, న్యాయ వెలుగు కోసం మనమందరం పోరాడాలని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏం చేసిందో మనందరికి తెలుసని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జైపూర్‌లో కాంగ్రెస్‌ ఈరోజు మెగా ర్యాలీ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలంతా ర్యాలీకి చేరుకున్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వివక్ష మరియు దౌర్జన్యాలను ప్రోత్సహించే ప్రభుత్వమే మన దేశానికి నాయకత్వం వహిస్తుందని అన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని సోనియా అన్నారు. విపక్ష నేతలపై బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీలో చేరేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని అన్నారు. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది’ అని జైపూర్ ర్యాలీలో సోనియా గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join

మరోవైపు దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరాయని, ప్రతి రాష్ట్రంలో పేపర్లు లీక్ అవుతున్నాయని ప్రియాంక గాంధీ అన్నారు. పేదలు, రైతుల మాట వినేవారు లేరన్నారు. ప్రజలు వేసే ఓటు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ఏర్పాటైన పెద్ద పెద్ద సంస్థలు నిర్వీర్యం కావడం ద్వారా మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. ప్రభుత్వాస్పత్రులను దుర్వినియోగం చేస్తున్నారని, నేడు ఈవీఎంలను కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి నెలకొందని ప్రియాంక అన్నారు.

Also Read: TDP : చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్న పాకాల జడ్పీటీసీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • Danger
  • democracy
  • Jaipur
  • Lok Sabha Elections 2024
  • narendra modi
  • Rally
  • sonia gandhi

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Sweet Kg

    Sweet Cost : ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

  • Bhatti Vikramarka

    Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

  • Pm Modi Trump Putin

    Us President : మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!

  • Folk Singer Maithili Thakur

    Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd