Union Budget: జీఎస్టీ చట్టాన్ని సరళీకృతం చేయాలని డిమాండ్ చేస్తున్న క్యాట్
వారం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు జీఎస్టీని సరళీకృత వ్యవస్థగా మార్చేందుకు జీఎస్టీ చట్టాన్ని సమీక్షించాలని వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఆర్థిక మంత్రిని డిమాండ్ చేసింది.
- By Gopichand Published Date - 09:20 AM, Fri - 26 January 24
Union Budget: వారం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు జీఎస్టీని సరళీకృత వ్యవస్థగా మార్చేందుకు జీఎస్టీ చట్టాన్ని సమీక్షించాలని వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఆర్థిక మంత్రిని డిమాండ్ చేసింది. దేశంలోని వ్యాపారులు సులభంగా చట్టాన్ని అనుసరించేలా జీఎస్టీ చట్టం చేయాలని ఆర్థిక మంత్రిని క్యాట్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న జిఎస్టి పన్ను విధానం చాలా క్లిష్టంగా ఉందని, జిఎస్టి పన్ను పరిధిని పెంచడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత జిఎస్టి రూపంలో ఎక్కువ పన్నును పొందేందుకు వీలుగా సరళీకరించాల్సిన అవసరం ఉందని క్యాట్ పేర్కొంది. పరస్పర సమన్వయం పెరిగేందుకు వీలుగా ప్రతి జిల్లా స్థాయిలో అధికారులు, వ్యాపారులతో కూడిన జీఎస్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని క్యాట్ కోరింది.
వ్యాపారుల డిమాండ్ల జాబితాపై క్యాట్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ కంపెనీల వంటి వ్యాపారులకు ఆదాయపు పన్ను ప్రత్యేక శ్లాబ్ను రూపొందించాలని అన్నారు. వ్యాపారాన్ని ప్రభావితం చేసే అన్ని చట్టాలను సమీక్షించాలని, అసంబద్ధంగా మారిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒకే దేశం, ఒకే చట్టం అనే ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు మద్దతు ఇస్తూ కాంప్లెక్స్ లైసెన్సింగ్ విధానాన్ని సులభతరం చేసేందుకు ఒకే లైసెన్స్ విధానాన్ని ప్రకటించాలని వ్యాపారుల సంఘం డిమాండ్ చేసింది.
Also Read: Republic Day 2024 : మన రిపబ్లిక్ డే చారిత్రక విశేషాలు ఇవిగో
ఈ-కామర్స్ పాలసీ, నేషనల్ రిటైల్ ట్రేడ్ పాలసీని అమలు చేయాలని క్యాట్ ఆర్థిక మంత్రిని డిమాండ్ చేసింది. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రేట్లకు వ్యాపారులకు సులభంగా రుణాలు అందించే పథకాన్ని ప్రకటించాలని క్యాట్ తన డిమాండ్ల జాబితాలో డిమాండ్ చేసింది. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యాపారులకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని సవరించాలని కోరారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో హోల్సేల్ వ్యాపారం కోసం ప్రత్యేక ట్రేడ్ జోన్ను రూపొందించాలని క్యాట్ డిమాండ్ చేసింది. ఇక్కడ ప్రభుత్వం విండోను ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా అన్ని రకాల ప్రభుత్వ ప్రక్రియలు సింగిల్ విండో ద్వారా పూర్తవుతాయి. వస్త్రాలు, బొమ్మలు, మొబైల్, ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్, ఆటో విడిభాగాలు, హార్డ్వేర్, ఆభరణాలు, రెడీమేడ్ వస్త్రాలు మొదలైన వివిధ ట్రేడ్ల కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని క్యాట్ ఆర్థిక మంత్రిని అభ్యర్థించింది. తద్వారా ఈ వస్తువుల ఎగుమతి పెరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
వ్యాపారులకు చెక్ బౌన్స్ పెద్ద సమస్య అని, అందువల్ల చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి జిల్లా స్థాయిలో రికవరీ ట్రిబ్యునల్ లేదా లోక్ అదాలత్ను ఏర్పాటు చేయాలని, అటువంటి కేసులను 45 రోజుల్లో పరిష్కరించాలని CAT పేర్కొంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు బ్యాంకు ఛార్జీలను చెల్లించే బాధ్యత వ్యాపారులు, వినియోగదారులపై పడకుండా, క్రెడిట్- డెబిట్ కార్డులపై బ్యాంకు ఛార్జీలను ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు సబ్సిడీ ఇవ్వాలని క్యాట్ అభ్యర్థించింది. డిజిటల్ పేమెంట్ ప్రమోషన్ బోర్డు ఏర్పాటు చేయాలని క్యాట్ డిమాండ్ చేసింది.
Tags
Related News
Telangana Budget 2024: బడ్జెట్లో వధూవరుల తులం బంగారం ప్రస్తావన ఎక్కడ: కవిత
తెలంగాణలో కాగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ బడ్జెట్ పద్దుపై అనేక ప్రశ్నలు సంధించారు.