Republic Day 2024 : మన రిపబ్లిక్ డే చారిత్రక విశేషాలు ఇవిగో
Republic Day 2024 : ఈరోజు మనం జరుపుకుంటున్న రిపబ్లిక్ డే (జనవరి 26)కు థీమ్ ఏమిటో తెలుసా ?
- By Pasha Published Date - 09:06 AM, Fri - 26 January 24
Republic Day 2024 : ఈరోజు మనం జరుపుకుంటున్న రిపబ్లిక్ డే (జనవరి 26)కు థీమ్ ఏమిటో తెలుసా ? ‘‘వికసిత్ భారత్.. భారత్ లోక్ తంత్ర్ కీ మాతృక’’!! ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి లాంటిదనే సందేశంతో ఈ థీమ్ను తీసుకున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని కర్తవ్య మార్గంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. దాదాపు 90 నిమిషాల పాటు పరేడ్ సహా వేడుకలన్నీ కొనసాగుతాయి. 77వేల మంది నేరుగా కర్తవ్య పథ్ పరిసరాల్లో వేడుకలను వీక్షించనున్నారు. ఈసారి 42వేల సీట్లను సాధారణ ప్రజల కోసం రిజర్వు చేశారు. ఈ సంవత్సరం భారత రిపబ్లిక్ డే వేడుకల కోసం ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చారు. రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా జరిగే కవాతులో 95 మంది సభ్యుల కవాతు బృందం, 33 మంది సభ్యుల బ్యాండ్ బృందం కూడా పాల్గొననుంది. ఇవాళ కర్తవ్య పథ్లో జరగనున్న 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ మహిళా కేంద్రంగా ఉంటుంది. ఈసందర్భంగా రిపబ్లిక్ డేతో(Republic Day 2024) ముడిపడిన కొన్ని ఆసక్తికర చారిత్రక విశేషాలను తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
- రిపబ్లిక్ డే అనేది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీకి గుర్తు.బ్రిటీష్ కలోనియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ (1935) స్థానంలో 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23న నిర్మించారు. 2022 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీ నుంచే భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తోంది.
- బీటింగ్ ది రిట్రీట్లో సైనిక సంగీతం భారత సాయుధ దళాల నుంచి కవాతు బ్యాండ్లు ఉన్నాయి. ఈ కవాతు సాంప్రదాయకంగా 1955 నుంచి కర్తవ్య పథ్లో జరుగుతోంది.
- 21 గన్ సెల్యూట్ సమయంలో 21 కానన్లతో కాల్చడం జరగదు. వాటికి బదులుగా 7 కానన్లతో మూడు రౌండ్లు కాల్చుతారు.
- 1950 సంవత్సరంలో మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగింది.
- మొత్తం 25 శకటాలు.. 16 రాష్ట్రాలు/యూటీలు, తొమ్మిది మంత్రిత్వ శాఖలు/విభాగాలు పరేడ్ టైంలో కర్తవ్య పథ్లోకి వస్తాయి.
- భారతదేశం 1947లో బ్రిటీష్ వాళ్ల నుంచి స్వాతంత్య్రం పొందినప్పటికీ.. 1950 జనవరి 26లోనే రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పుడే మన దేశం సార్వభౌమ, గణతంత్ర రాజ్యంగా మారింది.
- భారత రాజ్యాంగ సభ తన మొదటి సెషన్ను 1946 డిసెంబర్ 9న నిర్వహించింది. చివరి సమావేశాన్ని 1949 నవంబర్ 26న నిర్వహించింది.
Related News
Miss World 2024 : ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా గొప్ప పనులు.. తెలుసా ?
Miss World 2024 : చెక్ రిపబ్లిక్ దేశ అందాల సుందరి 24 ఏళ్ల క్రిస్టినా పిస్కోవా ‘మిస్ వరల్డ్- 2024’గా నిలిచారు.