Lok Sabha Elections 2024: మమతా కోటను బద్దలు కొట్టనున్న బీజేపీ
దేశంలో ఏడు దశల లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమవుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
- Author : Vamsi Chowdary Korata
Date : 03-04-2024 - 6:58 IST
Published By : Hashtagu Telugu Desk
Lok Sabha Elections 2024: దేశంలో ఏడు దశల లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమవుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
ప్రముఖ మీడియా సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్లో రాబోయే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 22 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 19 సీట్లతో సరిపెట్టుకోవలసి ఉంటుంది. కాగా, రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు దక్కవచ్చని సర్వే చెప్తుంది. కాగా 2019లో మమత టీఎంసీ 22 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి 18 సీట్లు వచ్చాయి. రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
పశ్చిమ బెంగాల్ లో ప్రాంతాల వారీగా సీట్ల అంచనా:
నార్త్ బెంగాల్: ఎనిమిది సీట్లలో బీజేపీ ఆరు, తృణమూల్ కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు.
ఆగ్నేయ బెంగాల్: పన్నెండు సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ ఏడు, బీజేపీ నాలుగు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకోవచ్చు.
గ్రేటర్ కోల్కతా: ఈ ప్రాంతంలోని ఐదు స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ అన్ని స్థానాలను గెలుచుకోవచ్చు.
నైరుతి బెంగాల్: 17 స్థానాల్లో బీజేపీ 12, తృణమూల్ కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోవచ్చు.
Also Read: Lok Sabha Elections 2024: బీఎస్పీ మూడో జాబితా విడుదల