HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Assembly Approves Begging Prohibition Bill 2025

Mizoram : అసెంబ్లీలో ‘యాచక నిషేధ బిల్లు 2025’కు ఆమోదం

ఈ బిల్లు ద్వారా కేవలం యాచకత్వాన్ని నిషేధించడమే కాదు, భిక్షాటన చేస్తున్న వారికి పునరావాసం కల్పించే అంశాన్నీ ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రేరణగా మారింది సైరంగ్-సిహ్ము రైల్వే ప్రాజెక్టు.

  • By Latha Suma Published Date - 12:19 PM, Thu - 28 August 25
  • daily-hunt
Assembly approves 'Begging Prohibition Bill 2025'
Assembly approves 'Begging Prohibition Bill 2025'

Mizoram : మిజోరం ప్రభుత్వం సామాజిక అభివృద్ధి దిశగా కీలకంగా ముందడుగు వేసింది. రాష్ట్రాన్ని యాచకుల రహిత ప్రాంతంగా మారుస్తూ “మిజోరం యాచక నిషేధ బిల్లు – 2025” ను రూపొందించి అసెంబ్లీకి ప్రవేశపెట్టగా, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ బిల్లు ద్వారా కేవలం యాచకత్వాన్ని నిషేధించడమే కాదు, భిక్షాటన చేస్తున్న వారికి పునరావాసం కల్పించే అంశాన్నీ ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రేరణగా మారింది సైరంగ్-సిహ్ము రైల్వే ప్రాజెక్టు. త్వరలో ప్రారంభం కానున్న ఈ రైల్వే మార్గం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి యాచకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలు మార్గాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అంతవరకే కాదు, ఈ రైలు ద్వారా వచ్చిన కొత్త సంపర్కంతో మిజోరంలో భిక్షాటన వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ఈ చట్టం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Read Also: Telangana : కుండపోత వర్షాలు..వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒక ప్రత్యేక “రిలీఫ్ బోర్డు”ను మరియు “రిసీవింగ్ సెంటర్”ను ఏర్పాటు చేస్తుంది. పట్టుబడిన యాచకులను ఈ కేంద్రంలో తాత్కాలికంగా ఉంచి, వారి స్వస్థలాలకు లేదా కుటుంబ సభ్యుల వద్దకు 24 గంటల లోపల పంపే ఏర్పాట్లు జరుగుతాయి. వారి అవసరాల్ని గుర్తించి, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లాల్రిన్‌పుయ్ ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలో యాచకుల సంఖ్య తక్కువగానే ఉందని, వారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలవారేనని వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, రాజధాని ఐజ్వాల్‌లో మాత్రమే 30 మందికి పైగా యాచకులు ఉన్నారు. వీరిలో స్థానికులు కంటే బయటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. చర్చిలు, స్వచ్ఛంద సంస్థలు, బలమైన సామాజిక వ్యవస్థ ఉండటంతోనే మిజోరంలో యాచకత్వం పెద్ద సమస్యగా మారలేదని ఆయన వివరించారు.

అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీ ఎంఎన్ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ నేత లాల్‌చందమ రాల్టే మాట్లాడుతూ..ఈ నిర్ణయం మిజోర రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని, అంతేగాక ఇది క్రైస్తవ మౌలిక విలువలకు విరుద్ధమని విమర్శించారు. సహాయమనేది క్రైస్తవ ధర్మసూత్రాల్లో ఒకటి. బాధితులకు అండగా నిలవడం చర్చిలు, సమాజాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. చట్టం అమలు పేరుతో యాచకులపై కఠిన చర్యలు తీసుకోవడం అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలపై సీఎం లాల్దుహోమా స్పందిస్తూ, ఈ చట్టం ఉద్దేశ్యం ఎవ్వరినీ శిక్షించడం కాదని స్పష్టం చేశారు. మేము యాచకులను శిక్షించమన్నది కాదు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చర్చిలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పునరావాస కార్యక్రమాలు చేపడతాం. మిజోరాన్ని మరింత అభివృద్ధి చెందిన, గౌరవనీయమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని పేర్కొన్నారు.

Read Also: Rains : తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aizawl
  • Ban Bill 2025
  • Begging Prohibition
  • Lalduhoma
  • Lalrindika Ralte
  • Mizoram
  • Mizoram Begging
  • narendra modi
  • Sairang-Sihhm Railway Line
  • Social Welfare Department Mizoram

Related News

Dhwajarohan In Ayodhya

Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!

అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు ముగిశాయి. దీనికి సంకేతంగా అయోధ్యంలో ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అయోధ్య ఘట్టంలో ఈ వేడుక ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ చారిత్రక వేడుక కోసం 100 టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయం, పరిసరాలను అలంకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం ఎగురువేశారు. సరిగ్గా అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరిగింది. మొత్తం 7 వేల మంది అతిథులు ఈ కార

    Latest News

    • Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇక‌పై సులభంగా షాపింగ్‌!

    • Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    • T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

    • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

    Trending News

      • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

      • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

      • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

      • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

      • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd